The government is focusing more on the midday meal scheme for students in public schools. Steps were taken to provide quality meals to the students.
- మధ్యాహ్న భోజన పథకంపై నివేదిక.
- సీఎం సమీక్ష నేపథ్యంలో తనిఖీలు చేయాలని ఆదేశాలు
- ఆర్జేడీ , డీఈవోలు ఒక్కో పాఠశాల తనిఖీ చేసి నివేదిక అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథ కంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది . విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది . ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్న భోజన పథకంపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్ననేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్త మైంది . విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరె క్టర్లు , జిల్లా విద్యాశాఖాధికారులు విడివిడిగా తమ పరిధిలోని ఒక పాఠశాలను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు . జిల్లా 1 . విద్యాశాఖాధికారి పాఠశాలలో మధ్యాహ్న భో జన పథకాన్ని తనిఖీ చేసిన సమయంలో | వాస్తవ నివేదికలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి . పాఠశాలలో అమలవు తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల అభిప్రాయాలు కచ్చితంగా తీసుకో వాలని , దీంతో పాటు ఉపాధ్యాయుల అభిప్రా యాలు కూడా తీసుకోవాలని ఆదేశాలుఅందాయి . ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉంది , విద్యార్థులు ఆస క్తిగా తింటున్నారా , లేకుంటే మధ్యాహ్న భోజన పథకంలో ఏమైనా మార్పులు చేయాలా అనే వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి సేకరించి నివేదిక రూపంలో పాఠశాల విద్యాశాఖ కమిష నర్కు అందజేయాల్సి ఉంది . విద్యార్థులకు ప్రస్తుతం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథ కంలో నాణ్యత పెంపు , మంచి పోషక విలు వలు ఉన్న ఆహారం అందించే విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది . ఈ నేప థ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులను గురువారం పరిశీలించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు నివేదిక అందజేయనున్నారు .
0 Response to "The government is focusing more on the midday meal scheme for students in public schools. Steps were taken to provide quality meals to the students."
Post a Comment