Idea
Idea : మీ పిల్లలను స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి దూరం చేసుకోవచ్చిలా . . .
స్కూలుకు వెళ్లే పిల్లలకు కోడి పిల్లలు ఇవ్వాలని నిర్ణయించారు . కేవలం కోడి పిల్లలే కాదు . పచ్చి మిరప విత్తనాలు కూడా ఇస్తున్నారు .
బడికి వెళ్లే పిల్లలకు కోడి పిల్లలు ఉచితం. అబ్బో.. ఇలాంటి పథకం ఎవరు, ఎక్కడ ప్రవేశ పెట్టారనుకుంటున్నారా? ఔను. నిజంగానే బడికెళ్లే పిల్లలకు కోడి పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే, ఇది మన దగ్గర కాదు. ఇండొనేసియాలోని బందంగ్ నగరంలో. ప్రపంచం మొత్తం విస్తరించిన స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ అక్కడకు కూడా పాకింది. దీంతో పిల్లలు ఆరుబయట ఆడుకోవడం మానేసి.. టీవీల ముందు, సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. ఈ జాఢ్యం ఎలా వదిలించాలా? అని ఆలోచించిన స్థానిక పెద్దలు ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు కోడి పిల్లలు ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం కోడి పిల్లలే కాదు. పచ్చి మిరప విత్తనాలు కూడా ఇస్తున్నారు. ఆ కోడి పిల్లలను పెంచడం వారి పని. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కోడి పిల్లలకు మేత వేయడం, వాటితో ఆడుకోవడం వంటి పనులు చేయడం వల్ల పిల్లలకు స్మార్ట్ ఫోన్కు దూరం అవుతారనే అభిప్రాయం ఉంది. దీంతోపాటు పచ్చి మిరప విత్తనాలు నాటి.. వాటికి నీళ్లు పోసి, మొక్కలు పెంచాలనే నియమం కూడా పెట్టారు.
0 Response to "Idea"
Post a Comment