* అతున్నత పాఠశాలలకు ర్యాంకింగ్..
* కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం..
* ఐదు అంశాలపై జాతీయ స్థాయిలో గుర్తింపు.
* రాష్ట్రంలో 5 జిల్లాలు ఎంపిక.
ప్రభుత్వ విద్యాలయాల్లో బోధనా నాణ్యతతో పాటు పాఠశాలల పరిస రాలను కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . సర్కారు పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వా నికి ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేయనుంది . రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి శ్రీకారం చుట్టిన ' మన బడి నాడు - నేడు ' కార్య క్రమానికి ఈ సర్వే విశేషంగా ఉపయోగపడనుం ది . మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ పాఠశాలలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజె . ప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ' విన్స్ ర్యాంకింగ్ టూల్ ' కార్యక్రమం చేపట్టింది . ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని జిల్లాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది .
విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాప్ - ' విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాప్
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాపను డౌన్లోడ్ చేయాలి . పాఠశాలలోని 5 అంశాలకు సంబంధించిన ఫొటోలను ఈ నెల 28వ తేదీ లోపు అందులో అప్లోడ్ చేయాలి . సురక్షితమైన తాగునీటిలో పాటు మరుగుదొడ్లకు నీటి సదుపాయం , వినియోగం ప్రధానమైనవి . అలాగే బాలబాలిక లకు విడివిడిగా మరుగుదొడ్లు , మూత్ర విసర్జన ప్రదేశాలు ఉండాలి . ప్రత్యేక అవసరాల పిల - లకు విడిగా మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలి . అలాగే చేతులు శుభ్రపరిచేందుకు సబ్సు , టాయిలెట్ వినియోగం తర్వాత , బోజనాలకు ముందు చేతులు కడుక్కునే వాతావరణం , ఘన , ద్రవ వ్యర్థాల నిర్వాహణ , పాఠశాల పరిస రాల పరిశుభ్రత ఉండాలి . మధ్యాహ్న భోజన పథకం ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వ హించాలి . ఈ అంశాలకు సంబంధించిన 39 ప్రశ్నల సమాధానాలతో పాఠశాల ఫొటోలను ' విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాప్లో ప్రధా నోపాధ్యాయుడు క్రోడీకరించాలి . నమోదు చేసిన సౌకర్యాలను బట్టి ఆయా పాఠశాలలకు స్టార్ - 1 నుంచి స్టార్ - 5 వరకు ప్రకటిస్తారు . ఆయా జిల్లాల్లోని అన్ని పాఠశాలలు యాప్ను ఇన్స్టాల్ చేసుకుని , ఫొటోలు అప్లోడ్ చేయా ల్సి ఉంటుంది .
ఆంధ్రప్రదేశ్ లో 5 జిల్లాల్లో . . .
ఈ ఏడాదికి గాను తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ , | - కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లా లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది . ఇందు లో భాగంగా రాష్ట్రంలోని విజయనగరం , విశా జపట్నం , వైఎస్సార్ , కర్నూలు , అనంతపురం జిల్లాలు ఎంపికయ్యాయి . దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించేం దుకు ఇటీవలే బెంగళూరులో జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు . దీనికి ఎస్ఎస్ఏ అసిస్టెంట్ ఏఎంఓ ఏ . శాభూష జరావు , స్కూల్ అసిస్టెంట్ టీచర్ వేణుగోపాల్ వెళ్లి శిక్షణ పొందారు . ర్యాంకుల వారీగా విభజన ఉత్తమ ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసేం దుకు 2017 - 18లో కేంద్ర ప్రభుత్వం వాష్ ( డ బ్ల్యూఏఎస్ హెచ్ ) అనే కార్యక్రమం నిర్వహిం చింది . ఇందులో జాతీయ స్థాయిలో పాఠశాలల మధ్య పోటీలు పెట్టింది . ఉత్తమ వాతావరణం లో ఉన్న పాఠశాలలను జాతీయ స్థాయిలో ఎం పిక చేసి ప్రత్యేక ప్రోత్సాహంగా నగదు బహు మతి అందజేసింది . అప్పట్లో జిల్లాకు చెందిన కొత్తవలస కేజీబీవీకి , మరో రెండు ఉన్నత పాఠ శాలలకు బహుమతులు లభించాయి . అయితే ఈ ఏడాది అలాకాకుండా ర్యాంకింగ్స్ విధా నాన్ని అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడిం చింది . పాఠశాలలలకు వచ్చే పాయింట్లను బట్టి ఐదు గ్రేడ్లుగా విభజించనున్నట్లు తెలిసింది . పాఠశాలకు వచ్చే గ్రేడను బట్టి పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణ ఎలా ఉందో అంచనా వేయవచ్చు . ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ' నాడు - నేడు ' కార్యక్రమానికి ఉపయోగపడనుంది .
0 Response to "Ranking for Emerging Schools .. Innovative program of the central government .."
Post a Comment