SGT posts high in the 2020 DSC
- 2020 డియస్సి లో ఎస్జీటీ పోస్టు లే అధికం.
- ఆ తర్వాతే స్కూల్ అసిస్టెంట్లు
- ఇక భాషా పండితులకు ఎసరు
- లెక్కలో నిమగ్నమైన అధికారులు
- టెట్ నిర్వహణకు సన్నాహాలు
- ఉపాధ్యాయుల నియామకం కోసం
వచ్చే ఏడాది నిర్వహించనున్న డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు అధికంగా ఉంటాయా . . . అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి . ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య అధికంగా ఉండగా , ఆ తర్వాత స్థానంలో స్కూల్ అసిస్టెంట్ (యస్. ఏ ) పోస్టులు ఉన్నట్లు తెలిసింది . రాష్ట్రంలో సుమారు 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం . వీటన్నింటి భర్త ప్రభుత్వం ఒకేసారి నోటిఫికేషన్ ను జారీ చేస్తే ఒక్కో జిల్లాలో సగటున 600 నుంచి 1200 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది . ఈసారి డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అధిక పోటీ ఉండే అవకాశం కూడా ఉంది . ఈసారి భాషా పండితులు ( యస్ ఎ ) పోస్టులకు ఎసరు పెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది . ఫలితంగా తెలుగు , హిందీ ,ఉర్దూ తదితర భాషా పండితులకు నష్టం వాటిల్లనుంది . ఈసారి కూడా పాత విధానంలోనే డియస్సి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది . అందులో భాగంగానే జిల్లాలు వారి గా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అధికారులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలివీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఖాళీల వివరాల నివేదికను సమర్పించారు . మరికొన్ని జిల్లాల నుంచి వివరాలు రావాల్సి ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు . రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీలు , నోటిఫికేషన్ , పరీక్షలపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశంఉంటుంది.
టెట్ తప్పనిసరి
విద్యాహక్కు చట్టం (ఆర్టిఈ ) ప్రకారాం ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ( టెట్ ) అర్హత సాధించాలి . కొత్తగా బీఎడ్ , డీఎడ్ , లాంగ్వేజ్ పండిల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు లక్షలాది మంది నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తున్నారు . వారిలో స్కూల్ అసిస్టెంట్లు మూడు లక్షల మంది ఉన్నారు . కొందరు గతంలో టెట్ అర్హత పొందగా , మరికొందరు టెట్ రాయాల్సి ఉంది . ఒక్కసారి టెట్లో అర్హత పొందిన వారంతా వెయిటేజీ మార్కులు కోసం మళ్లీ టెట్ రాసి పెంచుకునే అవకాశముంది .టెట్ లో ఒక్కసారి అర్హత పొందితే , దాని కాలపరిమితి పదేళ్ల వరకు ఉంటుంది . ఏడేళ్ళ క్రితం టెట్ లో అర్హులైన వారంతా మళ్లీ టెట్ రాసి తాజాగా అర్హత పొందాలి . డీఎస్సీ - 2018 నుంచి వీరు అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది .Bed అభ్యర్థులు టెట్ పేపర్ - 1లో తప్పనిసరిగా అర్హత సాధిస్తేనే డీఎస్సీకి దరఖాస్తు చేయాలి . ఈ అంశాలన్నీ పరిశీలిస్తే కొత్త డీఎస్పీ కంటే ముందుగా టెట్ కీలకంగా మారనుంది .
0 Response to "SGT posts high in the 2020 DSC"
Post a Comment