State Government Activity for Telugu Language Development
- తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ
- ఒకటో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు..
- అధికార భాషా సంఘం ఏర్పాటు, తెలుగు అకాడమీ పునరుద్ధరణ..
- త్వరలో ఉర్దూ అకాడమీ పునరుద్ధరణ..
తెలుగు భాషకు మంచిరోజులొస్తున్నాయి . మాతృభాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది . అధికారం లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిర్మాణాత్మక చర్యలు చేప ట్టింది . అధికార భాషా సంఘం , తెలుగు అకాడమీలను ఏర్పాటు చేసింది . పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా చేసింది . భాష , సంస్కృతుల వికాసానికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపట్టడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . చంద్రబాబు హయాంలో తెలుగు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది . 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యా లయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది . ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు . దీనిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ , తెలుగు భాషాభిమానులు ఆందోళనలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు . ఇక అధికార భాషా సంఘాన్ని నియమించలేదు . తెలుగు అకాడమీ ఏర్పా టును అసలు పట్టించుకోలేదు . తెలుగు భాషాభివృద్ధికి భాషావేత్తల సూచనలు , డిమాండ్లను చంద్రబాబు బేఖాతరు చేశారు . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఎన్నో వినతులిచ్చినా పెడచెవిన పెట్టారు . ' తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది . తప్ప . . చంద్రబాబు మనసులో తెలుగుకు స్థానం లేదు ' అని భాషాభిమానులు తీవ్రంగా విమర్శించారు .
తెలుగుకు మళ్లీ వెలుగులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు భాషా మోసానికి గట్టి చర్యలు చేపట్టారు . పరిపాలనలో తెలుగు వినియోగం , భాషాభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు , సూచనలు ఇచ్చేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు . దానికి తెలుగు , హిందీ భాషల్లో పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు అధ్యక్షుడిగా నియమించారు . ప్రముఖ సాహితీవేత్తలు మోదుగుల పాపిరెడ్డి , షేక్ మస్తాన్ . ఆచార్య చందు సుబ్బారావు , ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిలను అధికార భాషా సంఘం సభ్యులుగా ప్రభుత్వం నియమించింది . తెలుగు అకాడమిని పునరుద్దరించారు . ప్రముఖ రచయిత్రి , ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతిని ఆ అకాడమి అధ్యక్షురాలిగా నియమించారు . తద్వారా తెలుగు భాష , సాహిత్యాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు . . అదే విధంగా 1 నుంచి పదో తరగతి వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు గానీ ఉర్దూగానీ తప్పనిసరి చేసి అమ్మభాష తప్పనిసరిగా నేర్చుకునేట్టు చేశారు . రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉర్దూ ఆకాడమీని కూడా పునరుద్ధరించనుంది . భాషాభివృద్ధికి ప్రభు త్వం చేపడుతున్న చర్యల పట్ల సాహిత్యాభిమానులు , విద్యా వేత్తలు , సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . . . .
0 Response to "State Government Activity for Telugu Language Development"
Post a Comment