Engineering seats increase in OU, JNTU
ఓయూ, జేఎన్టీయూలో ఇంజనీరింగ్ సీట్ల పెంపు!
10 % ఈడబ్ల్యూఎస్ కోటా అమలుతో పెరగనున్న సీట్లు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!
త్వరలో ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదిక
జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ చేయాలనుకునే అగ్రవర్ణ పేదలకు త్వరలో శుభవార్త అందనుంది. ఈ ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 300 సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉత్తమ ర్యాంకు వచ్చినా ఈ క్యాంప్సలలో సీటు దక్కని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) ఊరట కలగనుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు, తదితర అంశాలపై ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి త్వరలో నివేదిక అందించనుంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి రానుంది. ప్రతి కోర్సులో 10ు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐఐటీ, ఎన్ఐటీల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేశారు.
కాలేజీలు - ప్రస్తుత - సీట్లు - పెరిగే సీట్లు
వర్సిటీల్లో - 14 - 3071 - 307
ప్రైవేటు - 169 - 62473 - 6247
మొత్తం - 183 - 65544 - 6554
ప్రైవేటులోనూ 6వేల సీట్ల పెరుగుదల?
రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 183 ఇంజనీరింగ్ కాలేజీల్లో 65,544 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 14 యూనివర్సిటీ కాలేజీల్లో 3071 సీట్లు, 169 ప్రైవేటు కాలేజీల్లో 62473 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుతో ప్రైవేటు కాలేజీల్లోనూ సుమారు 6,500 సీట్లు పెరగనున్నాయి. పలు కోర్సుల్లో సీట్లకు భారీ డిమాండ్ ఉండటంతో ఈడబ్ల్యూఎస్ కోటాతో పెరిగే సీట్లు కూడా కన్వీనర్ కోటాలోనే భర్తీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఉత్తమ ర్యాంకు సాధించే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ టాప్ కాలేజీల్లో సీటు లభించే చాన్స్ ఉంది.
10 % ఈడబ్ల్యూఎస్ కోటా అమలుతో పెరగనున్న సీట్లు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!
త్వరలో ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదిక
జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ చేయాలనుకునే అగ్రవర్ణ పేదలకు త్వరలో శుభవార్త అందనుంది. ఈ ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 300 సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉత్తమ ర్యాంకు వచ్చినా ఈ క్యాంప్సలలో సీటు దక్కని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) ఊరట కలగనుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు, తదితర అంశాలపై ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి త్వరలో నివేదిక అందించనుంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి రానుంది. ప్రతి కోర్సులో 10ు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐఐటీ, ఎన్ఐటీల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేశారు.
కాలేజీలు - ప్రస్తుత - సీట్లు - పెరిగే సీట్లు
వర్సిటీల్లో - 14 - 3071 - 307
ప్రైవేటు - 169 - 62473 - 6247
మొత్తం - 183 - 65544 - 6554
ప్రైవేటులోనూ 6వేల సీట్ల పెరుగుదల?
రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 183 ఇంజనీరింగ్ కాలేజీల్లో 65,544 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 14 యూనివర్సిటీ కాలేజీల్లో 3071 సీట్లు, 169 ప్రైవేటు కాలేజీల్లో 62473 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుతో ప్రైవేటు కాలేజీల్లోనూ సుమారు 6,500 సీట్లు పెరగనున్నాయి. పలు కోర్సుల్లో సీట్లకు భారీ డిమాండ్ ఉండటంతో ఈడబ్ల్యూఎస్ కోటాతో పెరిగే సీట్లు కూడా కన్వీనర్ కోటాలోనే భర్తీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఉత్తమ ర్యాంకు సాధించే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ టాప్ కాలేజీల్లో సీటు లభించే చాన్స్ ఉంది.
0 Response to "Engineering seats increase in OU, JNTU"
Post a Comment