Good News: Save Rs 1.5 lakh a year with Postoffice schemes!
గుడ్ న్యూస్: పోస్టాఫీస్ స్కీమ్స్తో ఏడాదికి రూ.1.5 లక్షలు ఆదా!
P0
డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ లేదా ఇండియా పోస్ట్ వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్ను అందిస్తోంది. వీటితో ఆకర్షణీయ రాబడితోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. దీంతో ఒక ఆర్థిక సంవత్సరంలో పోస్టాఫీస్ స్కీమ్స్తో రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆ స్కీమ్స్ ఏంటివో చూద్దాం. ఇండియా పోస్ట్ టైమ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఏడాది రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల పరిమితితో అకౌంట్ను ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్లపై పన్ను మినహాయింపు ప్రయోజనాలున్నాయి. ఈ అకౌంట్లపై 7.7 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంకులు అందించే వడ్డీ కన్నా ఇది 20 నుంచి 80 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువగా ఉంది
ఈ పథకంలో చేరినా కూడా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి. ఎన్ఎస్సీ స్కీమ్పై 7.9 శాతం వడ్డీ లభిస్తోంది. మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. కనీసం రూ.100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. వీటిపై లోన్ కూడా పొందొచ్చు. 60 ఏళ్లు లేదా ఆపైన వయసు ఉన్న వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. ముందుగానే పదవీ విరమణ తీసుకుంటే 55 ఏళ్లకు కూడా పథకంలో చేరే అవకాశముంది.
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. దీనిపై ఇప్పుడు 8.3 శాతం వడ్డీ లభిస్తోంది. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. పీపీఎఫ్ అకౌంట్ను కేవలం రూ.100తో ప్రారంభించొచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేసిన సరిపోతుంది. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఈ అకౌంట్పై ఇప్పుడు 7.9 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ ఆడ పిల్లల కోసం తీసుకువచ్చారు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఈ సుకన్య సమృద్ధి అకౌంట్లను తెరవొచ్చు. పదేళ్లలోపు ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఈ అకౌంట్పై ఇప్పుడు 8.4 శాతం వడ్డీ లభిస్తోంది.
0 Response to "Good News: Save Rs 1.5 lakh a year with Postoffice schemes!"
Post a Comment