Training of teachers on English .. Invitation for applications for Resource Persons ..
ఆంగ్లంపై ఉపాధ్యాయులకు శిక్షణ..
రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం..
6 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయులకూ శిక్షణ..
డైట్ సెంటర్లలో శిక్షణ..
మ్యాథ్స్, సైన్సులోనూ శిక్షణ..
జిల్లాల వారీగా శిక్షణ తరగతులు...
రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించ నున్నారు . అందుకోసం ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా బోధన నైపుణ్యాలు పెంచేం దుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన రీతిలో బోధించేలా చర్యలు చేపడుతోంది . ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఆంగ్ల మాధ్యమ ఇన్స్ట్రక్షన్ సెల్ ప్రత్యే కాధికారి కె . వెట్రిసెల్వి ఆంగ్ల మాధ్యమంలో బోధనా నైపుణ్యాలున్న అధ్యాపకులు రిసోర్స్ పర్సన్లుగా శిక్షణనిచ్చేందుకు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు . ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖా ధికారులకు రిసోర్స్ పర్సన్ల ఎంపిక కోసం దరఖాస్తులు వచ్చేలా చూడాలని సూచనలు చేశారు . మరోవైపు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యం లో ఉపాధ్యాయుల కోసం టీచర్ హ్యాండ్ బుక్స్ రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది .
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా నైపు ణ్యాలపై ఒక అంచనా రూపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు . పాఠశాల విద్యా శాఖ కమిషనర్ , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సమన్వయంతో ఈ ఆన్లైన్ టెస్టు రూపకల్పన చేయనున్నారు . టెస్ట్ ఆధారంగా గడింగ్ చేసి అవసరమైన టెస్ట్ మెటీరియల్ అందించనున్నారు . అలాగే ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఉపాధ్యాయులందరికీ ఆంగ్ల భాషలో బోధనపై తరగతులు నిర్వహించనున్నారు . ప్రస్తుతం ఉన్న నైపుణ్యాల ఆధారంగానే శిక్షణ కార్యక్రమాల రూపకల్పన జరగనుంది .
* ప్రాథమిక పాఠశాలల ఉపా ధ్యాయులకు ఆంగ్ల బోధనలో శిక్షణ కార్య క్రమాలకు రూపకల్పన చేస్తూనే . . మరోవైపు 6 నుంచి 8వ తరగ తులకు బోధించే ఉపాధ్యా యులకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో శిక్షణ తరగతు లను జిల్లాలవారీగా ఈ నెల నుంచి ప్రారంభించనున్నారు . ఇందుకోసం ఇన్ఫోసిస్ , అగస్త్య ఫౌండేషన్లతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది . ఒక్కో జిల్లా నుంచి అన్ని విభాగాల పాఠ శాలల నుంచి కలిపి 150 మంది ఉపాధ్యాయులు చొప్పున ఎంపిక చేసి నాలుగు రోజుల శిక్షణ అందించనున్నారు . 150 మంది ఉపాధ్యా యుల్లో 50 మంది మ్యాథ్స్ , 50 మంది ఫిజికల్ సైన్స్ , మరొక 50 మంది బయోలాజికల్ సైన్స్ బోధించేవారు ఉంటారు .
డిసెంబర్ 17 నుంచి 20 వరకు కడప జిల్లాలో , 26 నుంచి 29 వరకు చిత్తూరు జిల్లాలో , జనవరి 2 నుంచి 5 వరకు నెల్లూరు , 20 నుంచి 23 వరకు అనంతపురము , 27 నుంచి 30 వరకు కర్నూలు , ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు ప్రకాశం , 10 నుంచి 13 వరకు గుంటూరు , 17 నుంచి 20 వరకు కృష్ణా జిల్లాలో , 24 నుంచి 27 వరకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి . పరీక్షలు , వేసవి సెలవుల అనంతరం జూన్ 22 నుంచి 25 వరకు + తూర్పుగోదావరి , జూన్ 29 నుంచి జూలై 2 వరకు విశాఖపట్నం , 6 నుంచి 9 వరకు విజయనగరం , 13 నుంచి 16 వరకు శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి .
రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం..
6 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయులకూ శిక్షణ..
డైట్ సెంటర్లలో శిక్షణ..
మ్యాథ్స్, సైన్సులోనూ శిక్షణ..
జిల్లాల వారీగా శిక్షణ తరగతులు...
రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించ నున్నారు . అందుకోసం ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా బోధన నైపుణ్యాలు పెంచేం దుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన రీతిలో బోధించేలా చర్యలు చేపడుతోంది . ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఆంగ్ల మాధ్యమ ఇన్స్ట్రక్షన్ సెల్ ప్రత్యే కాధికారి కె . వెట్రిసెల్వి ఆంగ్ల మాధ్యమంలో బోధనా నైపుణ్యాలున్న అధ్యాపకులు రిసోర్స్ పర్సన్లుగా శిక్షణనిచ్చేందుకు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు . ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖా ధికారులకు రిసోర్స్ పర్సన్ల ఎంపిక కోసం దరఖాస్తులు వచ్చేలా చూడాలని సూచనలు చేశారు . మరోవైపు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యం లో ఉపాధ్యాయుల కోసం టీచర్ హ్యాండ్ బుక్స్ రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది .
భాషా నైపుణ్యాల అంచనా కోసం ఆన్ లైన్ టెస్ట్ . .
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా నైపు ణ్యాలపై ఒక అంచనా రూపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు . పాఠశాల విద్యా శాఖ కమిషనర్ , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సమన్వయంతో ఈ ఆన్లైన్ టెస్టు రూపకల్పన చేయనున్నారు . టెస్ట్ ఆధారంగా గడింగ్ చేసి అవసరమైన టెస్ట్ మెటీరియల్ అందించనున్నారు . అలాగే ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఉపాధ్యాయులందరికీ ఆంగ్ల భాషలో బోధనపై తరగతులు నిర్వహించనున్నారు . ప్రస్తుతం ఉన్న నైపుణ్యాల ఆధారంగానే శిక్షణ కార్యక్రమాల రూపకల్పన జరగనుంది .
డైట్ సెంటర్లలో శిక్షణ
ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లోని ఆంగ్ల బోధనా నైపుణ్యాలను పరిశీలించి , వారిని బోధనకు తగినట్లుగా సిద్ధం చేసేలా శిక్షణనిప్పిం చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు . ఇందుకోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు , డిస్ట్రిక్ట్ ఇంగ్లిష్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు . ఇప్పటికే జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఇన్స్టి ట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ( డైట్ ) కళాశాలలను ఇంగ్లిష్ ట్రెయినింగ్ సెంటర్లుగా ఉపయోగించుకోనున్నారు . అలాగే శిక్షణ కార్య క్రమంలో ప్రభుత్వ ,మండల పరిషత్ , జిల్లా పరిషత్ , / మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయు లను భాగస్వాములను చేస్తున్నారు . ఈ నెల 9వ తేదీ నుంచి శిక్షణ కార్య క్రమాల్లో పాల్గొనా లని ఇప్పటికే విద్యా శాఖలోని ఆయా విభాగాల ఉన్నతాధి కారులకు సమాచారం అందించా రు . అన్ని జిల్లాల విద్యా శాఖాధి కారులు రెండు రోజుల్లో రిసోర్స్ పర్సన్స్ నుంచి దరఖాస్తులు అందేలా చూడాలని ఆంగ్ల మాధ్య మ ప్రత్యేకాధికారి వెట్రిసెల్వి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు .
మ్యాథ్స్ సైన్స్ లోనూ శిక్షణ -
జిల్లాల వారీగా శిక్షణా తరగతులు
డిసెంబర్ 17 నుంచి 20 వరకు కడప జిల్లాలో , 26 నుంచి 29 వరకు చిత్తూరు జిల్లాలో , జనవరి 2 నుంచి 5 వరకు నెల్లూరు , 20 నుంచి 23 వరకు అనంతపురము , 27 నుంచి 30 వరకు కర్నూలు , ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు ప్రకాశం , 10 నుంచి 13 వరకు గుంటూరు , 17 నుంచి 20 వరకు కృష్ణా జిల్లాలో , 24 నుంచి 27 వరకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి . పరీక్షలు , వేసవి సెలవుల అనంతరం జూన్ 22 నుంచి 25 వరకు + తూర్పుగోదావరి , జూన్ 29 నుంచి జూలై 2 వరకు విశాఖపట్నం , 6 నుంచి 9 వరకు విజయనగరం , 13 నుంచి 16 వరకు శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి .
0 Response to "Training of teachers on English .. Invitation for applications for Resource Persons .."
Post a Comment