Another new initiative for the cleanliness of school environments.
- ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత
- ప్రతి బడిలో ఒక ఆయా నియామకం
- పారిశుధ్య పనుల నిర్వహణ కోసం నెలకు రూ4వేలు సామగ్రి కోసం అదనంగా రెండు వేలు వ్యయం
- ఫిబ్రవరి 1 నుంచి అమలుకు ఆదేశాలు జారీ పాఠశాల తల్లిదండ్రులకమిటీలతో సమావేశాలు
- ప్రధానోపాధ్యాయులకు డీఈవో ఆదేశం
మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూను అమలు చేసి చిన్నారుల హృదయాల్లో నిలిచిన సీఎం జగన్మో హన్ రెడ్డి తాజాగా వారి ఆరోగ్య పరిరక్ష జ , పాఠశాల పరిసరాల పరిశుభ్రత కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ఇందుకోసం ప్రతి పాఠశాలకు ఒక ఆయాను నియమించాలని , పారిశుధ్య పనులను నిర్వహించినందుకుగాను ఆమెకు నెలకు రూ . 4 వేలు చెల్లించాలని ఆదేశించారు . దీనిపై ఆవసర మైన చర్యలు చేపట్టేందుకు ఈనెల 30వ తేదీ గురు 16 . . వారం పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని , పాఠశాల కాంపోజిట్ గ్రాంటు నుంచి ప్రతి నెల రూ . 2 వేలు పారిశుధ్య సామగ్రి కోసం వెచ్చించాలని ఆదేశించారు .
నిధులు లభ్యత ఇలా :
చాలా పాఠశాలల్లో ఆయాలు లేని పరిస్థితి . ఈ స్థితిలో తరగతి గదులను సైతం విద్యార్థులే శుభ్రం చేసుకుంటున్న పరిస్థితు లు గమనిస్తుంటాం . ఇటువంటి పరిస్థితికి స్వస్తి చెప్పాలని , తమ పిల్లలు పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణంలో పెరుగు తున్నారనే భావనను తల్లిదండ్రుల హృదయాల్లో నుంచి తొల గించేందుకుగాను ఈనెల 8న అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభ సమయంలో తల్లిదండ్రులకు ముఖ్యమం త్రి జగన్మో హన్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు . తమ బిడ్డలు చదువు కునే పాఠశాల పారిశుధ్యం సక్రమంగా ఉండేందుకుగాను అమ్మ ఒడి పథకం కింద రూ . 15 వేలు పొందిన తల్లులు ఆందు లోనుంచి వెయ్యి రూపాయలు పాఠశాల పారిశుధ్య పనుల అమలుకు విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . అలా తల్లిదం డ్రులు ఇచ్చిన మొత్తాన్ని డీఈవో ఆధ్వర్యంలో పారిశుధ్య పనుల కోసం నూతనంగా ఏర్పాటుచేసే బ్యాంకు అకౌంట్ కు జమ చేస్తారు . అలా జమ అయిన మొత్తంలో నుంచి పాఠశాల ఆయాకు వేతనం చెల్లించేందుకు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వ ర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిర్వహించే అకొం టకు బదిలీ చేయాలి . దానిని ఆయా బ్యాంకు ఖాతాకు పాఠ శాల హెయం జమ చేయాల్సి ఉంటుంది . అయితే పాఠశాల తరగతి గదులు , టాయిలెట్లు , బాత్ రూములు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన బ్రు , చీపుర్లు , ఫినాయిల్ వంటి వాటి కోసం పాఠశాల కాంపోజిట్ నిధి నుంచి రూ . 2వేలు ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి .
పర్యవేక్షణకు సబ్ కమిటీ :
పాఠశాల తరగతి గదుల పరిశుభ్రతను , టాయిలెట్ల పరిశుభ్ర తను పరిశీలించేందుకు పాఠశాల తల్లిదండ్రుల కమిటీలోనుం చి ముగ్గురు సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి . వారు ప్రతిరోజు పాఠశాలలోని పరిశుభ్రతను పరిశీలిస్తూ అవ సరమైన సూచనలు , సలహాలను పాఠశాల హెడ్మాస్టరు ఆం దజేయాల్సి ఉంటుంది . వారానికి మూడుసార్లు గ్రామ సచివాలయ విద్య - సంక్షేమ కార్యదర్శి పాఠశాలను సందర్శిం చి పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . ఇది కాకుండా నెలకు ఒకసారి జరిగే పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశంలోను దీనిపై చర్చించాల్సి ఉంటుంది . అంతే కాకుండా మూడు నెలలకు ఒక సారి గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో స్వతంత్ర పర్యవేక్షణ నిర్వహింపజేసి లోటుపాట్లను తెలుసు కుని మార్పులు చేపట్టాల్సి ఉంటుంది .
రేపు పాఠశాలల తల్లిదండ్రులతో సమావేశం :
పాఠశాలలో విద్యనభ్యసించే చిన్నారుల తల్లిదండ్రుల కమిటీ లతో ఈనెల 30న పాఠశాల తల్లిదండ్రుల కమిటీలతో కలిసి ప్రధానోపాధ్యాయుడు సమావేశం నిర్వహించాలి . ఈ సమావే శంలో పాఠశాలలో పరిశుభ్రత కోసం ఆయా వేతనం కోసం అమ్మ ఒడి పథకం లబ్ధిదారులు అందరినీ తలా రూ . వెయ్యి విరాళంగా ఇవ్వమని కోరాల్సి ఉంటుంది . ఆ మొత్తం పాఠశా లలోని చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలా ఉపయోగ పడుతుందో కూడా వివరించాలి . అంతే కాకుండా పాఠశాలలో నీటి పొదుపు ఆవశ్యకత గురించి , నీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థినీ విద్యార్థుల్లోను చైతన్యం తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి . అయితే ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పక్కాగా అమలు చేయాలి .
0 Response to " Another new initiative for the cleanliness of school environments."
Post a Comment