Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CM Jagan write a letter for the poor mothers

 'జగనన్న అమ్మఒడి' తో మీకలలు సాకారం..
పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి జగన్ లేఖ..
CM Jagan write a letter for the  poor mothers

రూ.15,000 నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం..
పిల్లల చదువుల కోసం మీ తపనను పాదయాత్రలో స్వయంగా చూశా..
ఏపీ సీఎం లేఖ పూర్తి వివరాలు ఇలా...

' జగనన్న అమ్మ ఒడి ' పథకం ద్వారా పేదింటి పిల్లల చదువులు సాకారం అవుతాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు . పేదింటి తల్లులు తమ పిల్లలను బడికి పంపి మంచి చదువులు చదివించుకొనేందుకు ఏటా రూ . 15 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నామని , ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు . అమ్మ ఒడితో పాటు విద్యార్థుల బంగారు భవితవ్యం కోసం మరో 3 విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు . ఈ మేరకు ' జగనన్న అమ్మ ఒడి ' కి ఎంపికైన పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి లేఖ రాశారు . ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం , నాడు - నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన , నాణ్యమైన , పుష్టికరమైన మధ్యాహ్న భోజనం అమలు కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం లేఖలో తెలిపారు . లేఖలోని అంశాలు ఇవీ . . .

 దేశంలోనే తొలిసారి . . 

 పిల్లల చదువుకు తల్లుల పేదరికం అడ్డుకాకూడదని మన ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర పథకం రాష్ట్ర చరిత్రలోనే కాదు , దేశంలోనే మొట్టమొదటిసారి . మీలాంటి తల్లులు దాదాపు 43 లక్షల మందికి సుమారు రూ . 6 , 455 కోట్ల మేర ఈ విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది . 

మరో మూడు విప్లవాత్మక చర్యలు . . !

 మీ పిల్లలను బడికి పంపించాక చక్కటి చదువు చెప్పటం కోసం మరో మూడు విప్లవాత్మక చర్యలు కూడా తీసుకుంటున్నాం . మొదటిది పిల్లలకు చక్కటి ఉద్యోగ అవకాశాల కోసం మన పాఠశాలలన్నింటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం . రెండోది . . పాఠశాలల్లో మంచినీరు , విద్యుత్తు , మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు మెరుగుపరుస్తూ ' మనబడి నాడు - నేడు ' కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖల్ని మూడేళ్లలో మార్చబోతున్నాం . ఇక మూడవది . . పిల్లలకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం మరింత నాణ్యమైనదిగా , పుష్టికరంగానూ ఉండేందుకు సంక్రాంతి సెలవుల తరువాత నుంచి కొత్త మెనూ అమలు చేయబోతున్నాం . మీ పిల్లలు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని మరింత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ . . .

 మీ . . వైఎస్ జగన్మో హన్ రెడ్డి 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CM Jagan write a letter for the poor mothers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0