Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Full Details of NADU NEDU

15 నుంచి నాడు - నేడు
తొలి దశలో 15 , 715 పాఠశాలల అభివృద్ధి
Full Details of NADU NEDU

 సంక్రాంతి సెలవుల తరువాత మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు అర్హులందరికీ అమ్మ ఒడి
విద్యార్థులకు స్కూల్ కిట్లు . . పాఠశాలల్లో టాయిలెట్లు
 సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
ఆంగ్ల మాధ్యమం స్వయం శిక్షణ యాప్ రూపకల్పనకు ఆదేశాలు

పాఠశాలల్లో నాడు నేడు , అమ్మ ఒడి , మధ్యాహ్న భోజనంలో నాణ్య తపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారు లతో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు . మొదటి దశలో 15 , 715 పాఠ శాలల్లో నాడు - నేడు కింద అభివృద్ధి కార్యక్ర మాలు నిర్వహించాలన్నారు . ఈ నెల 15 నుంచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు . నాడు - నేడులో భాగంగా రెండో దశ , మూడో దశ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు . ఈ దశల కింద స్కూళ్లు , హాస్టళ్లు , అన్ని జూనియర్ , డిగ్రీ కళాశాలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు తయారు చేస్తామని అధికారులు వివరించారు . హాస్టళ్లలో పిల్లలకు మంచి టాయిలెట్లు , పడకలు , ఆల్మ రాలు , టేబుళ్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు . చేసే పనుల్లో నాణ్యత ఉండాలని నిర్దేశించారు .

15 నుంచి నాడు - నేడు 

మొత్తంగా రూ . 343 . 55 కోట్లు అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు . మధ్యాహ్న భోజనానికి రూ . 1294 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు . సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు .

 స్ఫూర్తి నింపేలా అమ్మ ఒడి

 పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు నిర్దేశించిన ఈ పథకం తొలి ఏడాదిలోనే స్ఫూర్తి నింపేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిం చారు . వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధన పాటించా లన్నారు . ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు వివరించాలన్నారు . అనాథ పిల్లలకు సంబంధించి అమ్మఒడి డబ్బును సగం ఆశ్రమానికి , మిగిలిన సగం పిల్లల పేరిట డిపాజిట్ చేయాలని సూచించారు . కొన్ని కుటుంబాల్లో 300 పైబడి యూనిట్ల విద్యుత్ వినియోగం ఉందని , ఇందులో ఉమ్మడి కుటుంబా లకు సంబంధించిన పిల్లలు ఉన్నారంటూ క్షేత్ర స్థాయి నుంచి తమకు ప్రతిపా దనలు వస్తున్నాయని అధికారులు తెలిపారు . మరోసారి రీ వెరిఫికేషన్ చేయించి అర్హులైన వారికి తప్పనిసరిగా అమ్మఒడి వర్తింప చేయాలని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు . వెబ్ ల్యాండ్ రికార్డులలో తప్పుల కారణంగా కొందరికి లేని భూమి ఉన్న ట్టుగా చూపుతున్నారని , దీనిపై కూడా ఫిర్యాదులు అందుతున్నాయని అధికా రులు సీఎం దృష్టికి తెచ్చారు . వీటిపై పరిశీలించి వెంటనే వారిని అర్హులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు . పాఠశాలలు ప్రారంభించే నాటికి పిల్లలకు పుస్తకాలు , యూనిఫారాలు పంపిణీ చేయాలన్నారు . స్కూల్ కిట్లో భాగంగా 3 జతల దుస్తులు , టెక్స్ట్ , నోట్ పుస్తకాలు , షూ , సాన్లు , బెల్ట్ , స్కూల్ బ్యాగ్ అందించాలన్నారు .

ఆంగ్ల మాధ్య మంపై సమీక్ష 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఆంగ్ల మాధ్యమంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు . ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు అధికారులు వివరించారు . స్వయం శిక్షణ కోసం ఉద్దేశించిన యాలను కూడా వెంటనే రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Full Details of NADU NEDU"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0