Good news for Jagan government for pensioners in AP
ఏపీలో పింఛన్ దారులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పింఛనుదారులకు మరొక శుభవార్త అందచేసింది.
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పింఛనుదారులకు మరొక శుభవార్త అందచేసింది.
ఈరోజు సీఎం జగన్ తో జరిగిన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారుల సమీక్షలో మాట్లడుతూ పలు అభివృద్ధి పథకాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వచ్చే నెల నుంచి పింఛనుదారులకు నేరుగా వారి ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఇక నుంచి అవ్వ తాతలు పింఛను కోసం అధికారుల దగ్గరకు వెళ్లకుండా ఏంచక్కా ఇంటికే తెచ్చి ఇవ్వడంతో పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు.
దీనితో పాటు రాష్ట్రంలో కొత్తగా మరొక 300 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఖాళీగా ఉన్న 15971 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వడంతో పాటు రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
పింఛన్లు ఇక నుంచి గ్రామా వాలంటీర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గ్రామా వాలంటీర్లు ద్వారా జగన్ సర్కార్ ఎవరైతే లబ్ది దారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పధకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
0 Response to "Good news for Jagan government for pensioners in AP"
Post a Comment