Good news for Secretariat candidates, clear the line for 616 people.
సచివాలయ అభ్యర్థులకు శుభవార్త, 616 మందికి లైన్ క్లియర్.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దానిలో భాగంగా గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో దాదాపుగా లక్షన్నర మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. మొదటి రెండేళ్ల తరువాత వీరందరూ ప్రభుత్వాధికారులుగా మారతారని తెలుస్తుంది. ఈ ఉద్యోగాల దరఖాస్తు సమయంలో ఇన్ సర్వీస్ వెయిటేజిని పొరపాటున కోల్పోయిన 616 మంది అభ్యర్థులకు వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖాళీలు అవకాశం ఉన్న చోట 616 అభ్యర్థుల నియామక పత్రాలు ఇవ్వవలసిందిగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించడం జరిగింది.
జగన్ సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యగావకాశం కల్పించి వారికి మంచి ఉపాధి కల్పించడం జరిగింది.
వీటితో పాటు ఇప్పటికే గ్రామాలలో వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ సరుకుతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది ప్రతి కుటుంబానికి చేకూరుతుందో తెలుసుకొని ప్రతి ఒక్కరు లబ్ది జరిగేలా సహాయం చేస్తున్నారు
0 Response to "Good news for Secretariat candidates, clear the line for 616 people."
Post a Comment