The government is the last chance for Jagannanna Amma '. . .
జగనన్న అమ్మఒడి ' అందని వారికి ప్రభుత్వం లాస్ట్ ఛాన్స్ . . .
ఇప్పటికే ప్రకటించిన జాబితాలో పేర్లు లేని అర్హులు వారి వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తీసుకువస్తే పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తామని మంత్రి తెలిపారు .
అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న అమ్మఒడి పథకం అందుతుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం అమలు, విధివిధానాలు, అర్హత ప్రామాణికాలు, సాంకేతిక సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న అమ్మఒడి లో అర్హులైన అందరికీ లబ్ది చేకూరుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 42 లక్షల 80 వేల 753మంది అమ్మఒడికి అర్హులుగా గుర్తించటం జరిగిందని, రూ.6,421 కోట్లు ఇందుకోసం కేటాయించటం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో పేర్లు లేని అర్హులు వారి వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి 5వ తేదీ సాయంత్రం 5గంటల లోపు తీసుకువస్తే పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించటం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నెంబర్లు పరిశీలన, ఇతర సాంకేతిక విషయాలన్నీ క్షుణ్ణంగా పరిసీలించిన అనంతరం ఈ నెల 9న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రకటించిన జాబితాలో పేర్లు లేని అర్హులు వారి వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తీసుకువస్తే పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తామని మంత్రి తెలిపారు .
అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న అమ్మఒడి పథకం అందుతుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం అమలు, విధివిధానాలు, అర్హత ప్రామాణికాలు, సాంకేతిక సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న అమ్మఒడి లో అర్హులైన అందరికీ లబ్ది చేకూరుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 42 లక్షల 80 వేల 753మంది అమ్మఒడికి అర్హులుగా గుర్తించటం జరిగిందని, రూ.6,421 కోట్లు ఇందుకోసం కేటాయించటం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో పేర్లు లేని అర్హులు వారి వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి 5వ తేదీ సాయంత్రం 5గంటల లోపు తీసుకువస్తే పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించటం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నెంబర్లు పరిశీలన, ఇతర సాంకేతిక విషయాలన్నీ క్షుణ్ణంగా పరిసీలించిన అనంతరం ఈ నెల 9న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
0 Response to "The government is the last chance for Jagannanna Amma '. . ."
Post a Comment