Jagananna Vasathi Deevena
జగనన్న వసతి దీవెనకు రూ.2,300 కోట్లు..
ఇంటర్ ఆపైన చదువుతూ స్కాలర్ షిప్ లు తీసుకునే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హుడు..
సంవత్సరానికి రూ.20,000 వేలు అందజేత..
11,61,244 మంది విద్యార్థులకు పథకం వర్తింపు..
ఇంటర్ ఆపైన చదువుతూ స్కాలర్ షిప్ లు తీసుకునే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హుడు..
సంవత్సరానికి రూ.20,000 వేలు అందజేత..
11,61,244 మంది విద్యార్థులకు పథకం వర్తింపు..
జగనన్న వసతి . దీవెన పథకంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం - ఈ ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు ఖర్చు చేయనుంది . ఇటీ వల వైఎస్సార్ నవశకంలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 95 , 887 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులయ్యారు . ఇంటర్ , ఆపైన చదువుతూ . . స్కాలర్ షిన్లు తీసుకునే ప్రతి విద్యా ర్థి ఈ పథకానికి అర్హుడు . ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవ త్సరానికి రూ . 20 వేలు అందజేస్తుంది . ఈ మొత్తాన్ని తల్లి బ్యాంకు అకౌంట్ కు జమచే స్తారు . ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు 10 , 65 , 357 మంది కాగా . . కొత్తగా 95 , 887 మంది విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 11,61,244కు చేరింది . త్వర లోనే వీరికి వసతి దీవెన కార్డులు అందచేస్తారు . వసతి దీవెన పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా నిధులు ఖర్చు కానున్నాయి . ఇంతవరకూ ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఫీజుల కింద ప్రభుత్వం రూ . 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది . ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ . 2 , 300 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుం ది . అంటే అదనంగా రూ . 1 , 500 కోట్లు ఖర్చు చేయాలి . విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు సంవత్సరానికి రూ . 20 వేలు ఖర్చు చేయాల్సిందేనని ప్రభుత్వం భావించింది . అందుకే ప్రభుత్వం రాజీ పడ కుండా ముందుకు సాగుతోంది .
0 Response to "Jagananna Vasathi Deevena"
Post a Comment