The main points revealed by AP CM in conducting video conferences with district collectors and SPs
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణలో ఏపీ సీఎం వెల్లడించిన ముఖ్య అంశాలు
- ఫిబ్రవరి 28న విద్యావసతి దీవెన ప్రారంభం అవుతుంది. దాదాపు 11 లక్షల మందికి విద్యావసతి దీవెన అందజేయనున్నాం.
- ఫిబ్రవరి 1 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత చేపడుతున్నాం. గ్రామ స్థాయిలో స్క్రీనింగ్ చేయాలి. దాదాపు 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయం.
- ఇప్పటివరకూ 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు. లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ కొనసాగుతోంది. 46వేల మందికి శస్త్రచికిత్సలు కూడా చేశారు.
- మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి పరిశీలన చేయాలి.
- సెర్ప్లో ఆర్డీఓ స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలి. భోజనం క్వాలిటీని నిరంతరం పర్యవేక్షించడానికి మొబైల్ యాప్.
- స్కూళ్లలో బాత్రూమ్స్ నిర్వహణపైన కూడా దృష్టిపెట్టాలి. అంగన్వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై దృష్టి సారించాలి’ అని సీఎం జగన్ ఆదేశించారు.
0 Response to "The main points revealed by AP CM in conducting video conferences with district collectors and SPs"
Post a Comment