AP Cabinet meeting on the 13th of this month
ఈనెల 13న ఏపీ కేబినెట్ సమావేశం . . . ఎజెండాలో కీలక అంశాలు . . .
13వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి .
13వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి .
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఈనెల 13న జరగనుంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తమ తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈనెల 11వ తేదీ సాయంత్రంలోగా పంపాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ప్రతి నెలా రెండో బుధవారం, నాలుగో బుధవారం రోజు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కానీ, కొన్ని కారణాల వల్ల అదే వాయిదా పడుతోంది. ఈ సారి 13వ తేదీ గురువారం రోజు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో మూడు రాజధానులకు సంబంధించిన రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజధాని అనేది రాష్ట్రం ఇష్టం అని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు శాసనమండలి రద్దు తీర్మానం, హైకోర్టులో కేసులు, రైతుల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలు, సచివాలయం తరలింపు విధివిధానాలు ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఉగాది నుంచి విశాఖ వేదికగా పరిపాలన చేయాలని సీఎం జగన్ సిద్దమవుతున్నారు. విశాఖలో సీఎంవో, ఇతర కార్యాలయాల తరలింపుపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. నవరత్నాల అమలు, ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అంశాలను కూడా కేబినెట్లో చర్చించనున్నారు.
మరోవైపు శాసనమండలిలో సెలక్ట్ కమిటీ ప్రక్రియ పూర్తికాలేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించి చైర్మన్ షరీఫ్ సభలో ప్రకటన చేసి వెళ్లిపోయారని, స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. మిలీనియం టవర్స్ నుంచి ఏ ఐటీ కంపెనీని కూడా తరలించలేదని చెప్పారు. టీడీపీ నేతలు పార్లమెంట్ సాక్షిగా అలాంటి ప్రకటనలు చేయడం రాష్ట్రానికి నష్టమని బొత్స అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ప్రకటన చేసిన నాటి నుంచే రాష్ట్రంలో వికేంద్రీకరణ ప్రారంభమైనట్టేనని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ లో ప్రకటన నాటి నుంచే వికేంద్రీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. న్యాయ పరంగా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. అయితే మా విధానం ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. తరలింపు పై ప్రజలు, ఉద్యోగుల అంతా సంతోషంగా నే ఉన్నారు. వారు ఎవరూ ప్రభుత్వనికి ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ప్రభుత్వ నిర్ణయానికి చట్టబద్దత తేవాలని చూస్తున్నాం. వికేంద్రీకరణ ప్రక్రియ ఆలస్యమైనా ప్రభుత్వానికి ఎలాంటి ఆతృతా లేదు.’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు.
0 Response to "AP Cabinet meeting on the 13th of this month"
Post a Comment