Changes in 10th class exams
- ' పది ' పరీక్షల్లో సమూల మార్పులు
- సబ్జెక్టు పేపర్ వారీగా గ్రేట్లు
- 24 పేజీల సమాధానపత్రాలు
- అంతర్గత మార్కులు , బిట్ పేపర్లు రద్దు
- ఆంధ్రజ్యోతి ' తో డీఈవో సుబ్బారావు
సంస్కరణలలో భాగంగా మార్చిలో జరగ నున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . పరీక్షల్లో ఉత్తీర్ణత , గ్రేడ్ల కేటాయింపు , ఇతర మార్కులపై జిల్లా విద్యా శాఖాధికారి వీఎససుబ్బారావు ఆంధ్రజ్యోతికి వివరించారు .
పరీక్షలకు సంబం ధించి కొన్ని సామాజిక మాధ్యమాలలో వస్తున్న వివరాలపై విద్యార్థులు , తల్లిదం డ్రులు అపోహలకు గురికావద్దని ఆయన తెలిపారు .
- పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కుల భారాన్ని తొలగించారు .
- గత ఏడాది వరకు 20శాతం ఇంటర్నల్ మార్కులు ఉండేవి . ప్రస్తుతం దానిని రద్దు చేశారు .
- ప్రశ్నపత్రంలో గతంలో మాదిరి పార్టు - ఎ , పార్టు - బి ( బిట్వీపర్ ) వేరువే రుగా కాకుండా లక్ష్యాత్మక ప్రశ్నలు కూడా కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు .
- విద్యార్థి రాయాల్సిన ప్రశపత్రాల సంఖ్యలో ఎటువంటి మార్పులేదు . గతంలో మాదిరిగానే ఆరు సబ్జెక్టులను 11 పేపర్లుగా రాయాల్సి ఉంటుంది .
- ఇంట ర్నరల్ మార్కులు లేవు కనుక విద్యార్థులు ప్రతి సబ్జెక్టును వంద మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది .
- పరీక్ష కాల వ్యవధి గతంలో మాదిరిగానే 2 . 45 గంటలు ఉంటుంది .
- ప్రశ్న పత్రం చదివేందుకు 15 నిమిషాలు , రాసేందుకు రెండు గంటల వరకు ఉంటుంది .
- పరీక్షకు 3 . 15 గంటల వ్యవధి ఉంటుంది .
- ప్రస్తుత పరీక్షల నుంచి విద్యార్థులకు ఇంటర్మీడియేట్ తరహా 24 పేజీల ఆన్సర్ బుక్ట్ ఇస్తారు .
- ఈ బుక్ లోనే విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధా నాలు రాయాల్సి ఉంటుంది .
- విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులు అవుతారు .
- హిందీలో మాత్రం 20 మార్కులే ఉత్తీర్ణత .
- ఒక సబ్జెక్టులో రెండు పేపర్లు ఉంటే రెండు పేపర్లలో విద్యార్థులు సాధిం చిన మొత్తం మార్కులను ప్రాతిపదికన తీసుకొని విద్యార్థులను ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తారు .
- ఒక విద్యార్థి 10 / 10 గ్రేడ్ సాధించాలంటే రెండు పేపర్లలో కలిపి 92 మార్కులు సాధించాల్సి ఉంటుంది . అదే హిందీలో అయితే 90 మార్కులు సాధి స్తేనే 10 / 10 గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు .
- విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో ప్రతి పేపర్లో సాధించిన మార్కులు , గ్రేడ్ వివరాలను విద్యార్థుల మార్కుల జాబితాలో ఇస్తారు .
- మొత్తం గ్రేడు విద్యార్థుల అన్ని సబ్జెక్టుల్లో సాదించిన మార్కుల ఆధారంగానే కేటాయిస్తారు .
- ప్రశ్నపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి .
- ప్రస్తుతం బిట్ పేపర్ లేనందున మొత్తం 33 ప్రశ్నలను 50 మార్కులకు ఇస్తున్నారు .
- వీటిలో వ్యాస రూప ప్రశ్నలు ఐదు , లఘ ప్రశ్నలు 8 , అతిలఘ ప్రశ్నలు 8 , అబ్జెక్టివ్ టైషుప్ర శ్నలు 12 ఉంటాయి .
- విద్యార్థులకు మార్కులు జాబితాలో ప్రతి పేపర్ లో సాధించిన గ్రేడు చూపిస్తారు .
- అయితే సబ్జెక్ట్ గ్రేడ్ మొత్తం రెండు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగానే కేటాయిస్తారు .
- జీపీఎ పాయింట్ల కేటాయింపు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు .
- పదవ తరగతి పరీక్షల కోసం పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాలి .
- వారు చక్కగా పరీక్షలు రాసేందుకు ఒత్తిడి లేని వాతావరణాన్ని తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు కల్పించాలని డీఈవో సూచించారు .
0 Response to "Changes in 10th class exams"
Post a Comment