Increased number of pensions.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!
Jagan Government: జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి పింఛన్ పథకం. ఇవాళ్టి నుంచి ఈ సంఖ్యను మరింతగా పెరగబోతోంది. ఈ రోజు నుంచి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారుల సంఖ్యను 58,99,065 పెంచింది. గత నెలతో పోలిస్తే 4,30,743 పింఛన్లు పెరిగాయి. జగన్ సర్కార్ ఫిబ్రవరిలో 54,68,322 మందికి పింఛన్లు పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నెలన్నర వ్యవధిలో కొత్తగా 7.41 లక్షల(ఫిబ్రవరిలో 6.14 లక్షలు, మార్చిలో 1.27 లక్షలు) మందికి పింఛన్లు మంజూరు చేసింది.
కాగా, మార్చి 1 ఆదివారం అయినప్పటికీ గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులకు ఇంటి వద్దనే డబ్బును అందజేస్తారని తెలిసిన విషయమే.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించింది. పింఛన్లు పొందే లబ్ధిదారుల సంఖ్య ఏ జిల్లాకు ఎంత పెరిగిందంటే.. ఎక్కువశాతం తూర్పుగోదావరిలో 6,23,093 మంది, తక్కువగా విజయనగరంలో 3,02,734 మంది కొత్తగా పింఛన్లు పొందనున్నారు.
0 Response to "Increased number of pensions.!"
Post a Comment