Let the kids play outside. Set aside at least 20 minutes per day
పిల్లల్ని బయటే ఆడుకోనివ్వండి.
రోజుకు కనీసం 20 నిమిషాలు కేటాయించండి
ఇలా చేస్తే జబ్బులు , కేన్సర్లు రావు 'ఈనాడు ' తో ఎయిమ్స్ వైద్యుడు , పద్మశ్రీ గ్రహీత లలిత్ కుమార్
రోజుకు కనీసం 20 నిమిషాలు కేటాయించండి
ఇలా చేస్తే జబ్బులు , కేన్సర్లు రావు 'ఈనాడు ' తో ఎయిమ్స్ వైద్యుడు , పద్మశ్రీ గ్రహీత లలిత్ కుమార్
- భానుడి కిరణాల తాకిడిలో తుళ్లింతలు . . గాలి కెరటాల్లో కేరింతలు ,
- చెట్ల కింద మట్టి గూడుల ఆటలు
- ఇలాం టివి ఈనాటి పిల్లలకు ఎంతమందికి అందుతున్నాయో తెలీదు కానీ . .
- ఇవి లేక చాలా మందిలో అనేక జబ్బులు వస్తున్నాయన్నది మింగుడు పడని సత్యం మేలుకోండి తల్లిదండ్రులూ . .
- పిల్లల్ని బయటకు వెళ్లనివ్వండి .
- ఎండలో కాసేపు ఆడుకోనివ్వండి . . బయట గడిపే సమయం ఎంత పెరిగితే అంత మేలు .
పదేళ్ల క్రితం పాఠశాల వయసు పిల్లల్లో 2 . 5 శాతం మందికి కేన్సర్ ఉండేది . ఇప్పుడా సంఖ్య 5 - 6 శాతానికి వచ్చింది . రక్త సంబంధ ఇబ్బందులూ అంతకంతకూ పెరు గుతున్నాయి . జీవనశైలిలో ప్రమాదకర మార్పులు రావడమూ ఇందుకు ఓ కార ణంగా తెలుస్తోందని అంటున్నారు . దిల్లీ ఎయిమ్స్ అంకాలజీ విభాగాధిపతి , పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ లలిత్ కుమార్ , తక్కువ ధరకే మూలకణాలు , ఎముక మజ్జ మార్పిడిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారీ యన . ఆదివారం విశాఖకు వచ్చిన లలితక్కు మార్ ' ఈనాడు ' తో మాట్లాడారు .
ఆ వివరాలు ఆయన మాటల్లోనే
- పిల్లల్లో రక్త సంబంధ ఇబ్బందులు సాధార ణమైపోయాయి .
- 10 - 15 ఏళ్లతో పోల్చి చూస్తే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ( ఏఎల్ ఎల్ ) ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నట్లు నిర్ధా రణ అవుతోంది .
- ఇది పలు రకాల ఇన్ ఫెక్షన్ల ద్వారా , రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం ద్వారా పిల్లల్లో వృద్ధి చెందడానికి కారణం .
- ఎలాంటి ఇన్ఫెక్షన్ల కారణంగా రక్తంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది ఇంకా తేలలేదు .
- గతంలో పిల్లలు బయటే ఆడుకునేవారు . ఇప్పుడు ఫోన్లు , బొమ్మలతో ఇళ్లకే పరిమి తమవుతున్నారు .
- ఈ తరహా అలవాట్లతో వారిలో రోగ నిరోధకశక్తి తగ్గి . . ఇన్ ఫెక్షన్ల ప్రభావంతో రక్తకణాలు , డీఎన్ఎల్లో మార్పులు వస్తున్నాయి .
- వీటిలోని ప్రమాద కర స్వతంత్ర కణాలు పెరిగి పలు వ్యాధులు వచ్చేలా చేస్తున్నాయి .
- ఏఎల్ లాంటి కేన్సర్లకూ కారకాలవు తున్నాయి .
- బలహీనంగా ఉన్న పిల్లల్లో అప్లాస్టిక్ అనీమియా కనిపిస్తోంది . వీరిలో రక్తం తయారవకపోవడం లాంటి లక్షణాలుంటున్నాయి.
- దశాబ్దకాలంలో ఇలాంటి పిల్లల సంఖ్య పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి .
- రోజుకు కనీసం 15 - 20 నిమిషాలైనా పిల్లలు పగలు బయట తిరగడం మొదలు పెడితే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది .
- తద్వారా ఇన్ ఫెక్షన్లతో పోరాడేతత్వం వస్తుంది . కేన్సర్లను గుర్తించే ఆసుపత్రులు , డయాగ్న స్టిక్ సాంకేతికత దేశంలో బాగా పెరిగింది .
- ప్రజల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ( ఏఎల్ ) , అక్యూట్ మైలోయిడ్ లుకే మియా ( ఏఎంఎల్ ) కేన్సర్లు బాగా పెరి గాయి .
- క్షేత్ర స్థాయిలోని ఫిజీషియన్లకూ అవగాహన లేకపోవడంతో జబ్బులు వచ్చే దాకా జనాలకు తెలియని పరిస్థితి ఉంది .
- ప్రస్తుతం 150 జిల్లాల్లో రొమ్ము కేన్సర్ పై క్షేత్రస్థాయి సిబ్బంది నిర్ధారణ చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు .
0 Response to "Let the kids play outside. Set aside at least 20 minutes per day"
Post a Comment