'Teachers' Exchange' in Secondary Schools.
సెకండరీ పాఠశాలల్లోనూ 'టీచర్ల ఎక్స్చేంజి'.
ఈమేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఆమోదం తెలిపింది. ట్విన్నింగ్ స్కూళ్ల కార్యక్రమం కింద ఇప్పటికే రాష్ట్రంలోని 11,378 స్కూళ్లను అధికారులు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లున్నాయి. వీటిలో ఇప్పటికే ఈ కార్యక్రమం కింద అర్బన్ రూరల్ స్కూళ్ల మధ్య, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల స్కూళ్ల మధ్య టీచర్ల, విద్యార్థుల ఎక్స్చేంజి కార్యక్రమాలను అధికారులు ప్రారంభించారు.
ఇప్పుడు సెకండరీ స్కూళ్లలో కూడా ఈ ట్విన్నింగ్ కార్యక్రమానికి అనుమతించడంతో జిల్లాకు 20 చొప్పన స్కూళ్లను ఎంపికచేసి దీన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలో గతంలో ఎంపిక చేసిన స్కూళ్లలో గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో చేపట్టిన ట్విన్నింగ్ కార్యక్రమాలు ఫలితాలిస్తున్నాయని ఎస్ఎస్ఏకు అందుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కరిక్యులమ్లో గుణాత్మకత, బోధనా విధానాలు, ప్రాజెక్టులు, స్టడీ టూర్లు, సైన్స్ ఫెయిర్స్, ఆర్ట్స అండ్ క్రాఫ్ట్స్ స్పోర్ట్సు అండ్ గేమ్స్, కల్చరల్, లిటరరీ, స్వచ్ఛందసేవ, లైఫ్స్కిల్స్, స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మేనేజ్మెంటు కమిటీలు, టీచర్ కౌన్సిల్స్ వంటి అంశాలలో ఆయా స్కూళ్ల మధ్య తేడాలను గుర్తిస్తూ కొత్త అంశాలను టీచర్లు, విద్యార్థులు నేర్చుకుంటున్నారు
0 Response to "'Teachers' Exchange' in Secondary Schools."
Post a Comment