The distribution of ration cards will be launched from today.
రేషన్కార్డుల స్థానంలో ప్రవేశపెట్టిన బియ్యంకార్డుల పంపిణీని నేటినుంచి చేపట్టనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కోటీ 30లక్షల కుటుంబాలకు కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆమో దం తెలిపింది.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 1.47కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 17లక్షల కార్డులు తగ్గిపోయినట్టే. అయితే వాటిలో 7.5లక్షల కార్డులు పూర్తిగా అర్హత లేనివిగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 8లక్షల కార్డులను పునఃపరిశీలన చేయనున్నారు. లక్షన్నర కార్డులపై 18, 19తేదీల్లో తిరిగి సర్వే నిర్వహించనున్నారు. క్యూఆర్ కోడ్, వాటర్ప్రూఫ్ టెక్నాలజీతో రూపొందించిన కొత్త కార్డులను నేటినుంచి వలంటీర్లే ప్రతిఇంటికీ వెళ్లి అందజేస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 20లక్షల మంది ప్రతినెలా రేషన్ తీసుకోవడం లేదు. అంతే స్థాయిలో కార్డులు అనర్హత జాబితాలోకి వస్తాయని అంచనా వేశారు. అయితే ప్రస్తుతానికి 7.5లక్షల కార్డులు మాత్రమే పూర్తిగా అనర్హమైనవిగా తేలాయని, మిగిలినవాటి గురించి పునఃపరిశీలనలో తేలుస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. కాగా, ఈనెల 21నాటికి బియ్యం కార్డుల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌరసరఫరాల కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. అయితే దీనికి తుదిగడువు కచ్చితంగా ఏమీలేదని, ఇదో నిరంతర ప్రక్రియ అని చెప్పారు. 8లక్షల కార్డులపై వీఆర్వోలతో పునఃపరిశీలన చేపడతామన్నారు. ఈనెల 25 తర్వాత అర్హత ఉన్నవారు ఎవరైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 5రోజుల్లోనే కార్డు జారీ చేస్తామన్నారు.
ప్రస్తుతం ఉన్న కార్డులు - కోటీ 47లక్షలు
కొత్తగా ఇస్తున్నవి - కోటీ 30లక్షలు
అనర్హులు - 7.5లక్షలు
పునఃపరిశీలన చేయాల్సినవి -8లక్షలు
ఇంకా సర్వే చేయాల్సినవి - 1.5లక్షలు
తగ్గిపోయిన కార్డులు - 17లక్షలు
Check your Ration Card Status
0 Response to "The distribution of ration cards will be launched from today."
Post a Comment