The toughest steps for the upper classes
- పై తరగతులకు పటిష్టమైన అడుగులు
- కింది క్లాసులోని అంశాలపై పునశ్చరణ ,
- లోపాల సవరణ
- 1 - 5 తరగతులు చదివే 17 . 70 లక్షల మందికి నెలరోజులు శిక్షణ
ఒక తరగతి నుంచి మరో తరగతిలోకి వెళ్లే విద్యార్థుల్లో అవసరమైన ప్రమాణాలు , నైపుణ్యాలుంటేనే పై క్లాసుల్లోని పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకోగలుగుతారు . కింది తరగతుల్లోని అంశాల్లో అవగాహన పెంచుకుని ఉంటే పై తరగతుల్లోని అంశాలు సులభంగా ఆకళింపు చేసుకోగల్గుతారు . కానీ , ఇప్పటివరకు విద్యార్థులకు సరిపడ హాజరు ఉంటే చాలు . . పై తరగతుల్లోకి పంపించేస్తున్నారు . దీనివల్ల తరగతులు పెరుగుతున్నా విద్యార్థుల్లో ప్రమాణాలు పెరగడం లేదు . ఈ నేపథ్యంలో . . విద్యార్థుల్లోని సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయో ముందే పరిశీలించి లోపాలుంటే వాటిని సరిచేసి పై తరగతులకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది .
మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు శిక్షణ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 17 , 70 , 941 మంది విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు కింద ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు . మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ కోర్సు ఉంటుంది . విద్యార్థుల్లో ప్రస్తుత తరగతుల్లోని అంశాలను అవగాహన చేసుకోవడంలో ఏమైనా లోపాలుంటే వాటిని సవరిస్తారు . అలాగే , ఆ తరగతుల్లోని పాఠ్యాంశాలపైనా క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండేలా తీర్చిదిద్దుతారు . ముఖ్యంగా తెలుగు , ఇంగ్లిష్ , గణితం , పర్యావరణ అంశాలపై బోధన ఉంటుంది . సాధారణ తరగతుల మాదిరి కాకుండా ఆటపాటల ద్వారా పిల్లలకు ఆసక్తికరమైన రీతిలో ఈ 30 రోజులపాటు బోధన చేపడతారు . ఏ రోజున ఏ కార్యక్రమం చేపట్టాలో సవివరమైన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేశారు . 14 థీములలో శిక్షణ అంశాలను రూపొందించారు . ఒక్కో థీమును రెండు రోజుల పాటు బోధిస్తారు . పాటలు , కథలు , ఆటలు వంటి కార్యక్రమాల ద్వారా ఆయా అంశాలను నేర్పిస్తారు . ఈ కార్యక్రమంలో 94 , 805 మంది టీచర్లను భాగస్వాములుగా చేస్తున్నారు . ఈ కోర్సుకు సంబంధించి పిల్లలకు , స్కూళ్లకు ప్రత్యేకంగా టీఎం ( టీచింగ్ , లెర్నింగ్ మెథడాలజీ ) కిట్లను సరఫరా చేస్తున్నారు . విద్యార్థుల కిట్కు రూ . 200 చొప్పున , స్కూల్ కిట్కు రూ . 1 ,500 చొప్పున వ్యయం చేస్తున్నారు . ఆడియో వీడియో బోధనకు వీలుగా విద్యార్థులకు టీవీలు , డీవీడీలు , ఇంటర్నెట్ సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు .
లక్ష్యా లు ఇవీ . .
- భాషకు సంబంధించి అక్షరాలపై స్పష్టత , వినడం , మాట్లాడడం , చదవడం , రాయడంపై దృష్టి పెడతారు .
- గణితం , పర్యావరణ విద్యలో అంకెలు సంబంధిత అంశాలలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారు .
- ఆనందాన్ని పంచే కార్య క్రమాలతో కూడిన బోధన ద్వారా విద్యార్థులకు ఆయా అంశాలను నేర్పిస్తారు .
- వినడం , మాట్లాడడం తదితర అంశాల్లో ఆడియో విజువల్ పద్ధతులను అనుసరిస్తారు .
- తొలిరోజు ఆయా తరగతుల్లోని పిల్లల స్థాయిలను తెలుసుకుంటారు .
- తదుపరి మార్చి 17 నుంచి ఏప్రిల్ 21 వరకు పిల్లలతో వివిధ కార్యక్రమాలు చేపడతారు .
- ఏప్రిల్ 22న పిల్లల్లో కొత్తగా పెరిగిన సామర్థ్యాలను గుర్తిస్తారు .
- ఏప్రిల్ 23 చివరి రోజున తల్లిదండ్రులు , టీచర్ల సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు అందిస్తారు .
జిల్లాల వారీగా బ్రిడ్జి కోర్సులో భాగస్వాములయ్యే టీచర్లు , విద్యార్థులు . .
జిల్లా. టీచర్లు. విద్యార్థులు
అనంత పురం 9,168. 1,68,402
చిత్తూరు 9,119. 1,57,852
తూ . గోదావరి. 8,563. 1,71,264
గుంటూరు. 8,212. 1,50,036
కడప 6,604. 1,06,162
కర్నూలు. 6,596. 1,01,293
నెల్లూరు 6,727. 2,02,620
ప్రకాశం. 7,747. 1,12,562
శ్రీకాకుళం. 6,819. 1,40,642
విశాఖపట్నం 6,534. 1,38,624
విజయనగరం. 5,381. 90,399
ప . గోదావరి. 6,466. 1,19,512
మొత్తం. 94,805. 17,70,341
0 Response to "The toughest steps for the upper classes"
Post a Comment