Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Training for teachers from tomorrow

  • రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ..
  • మూడు విడతల్లో శిక్షణ.
  • 1-5 తరగతులను బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే శిక్షణ..
  • ఉపాధ్యాయులు వారికి కేటాయించిన తేదీల్లో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది..
  • ఐదు రోజుల పాటు శిక్షణ..
  • ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం శిక్షణ..
Training for teachers from tomorrow

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుకుని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది . ఇందులో భాగంగా ఉపాధ్యా యులకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు శిక్షణ ఇచ్చేందుకు తొలుత ఉత్తర్వులు జారీ చేసింది . పరీక్షల సమయంలో టీచర్లకు శిక్షణ ఇస్తే ఆ ప్రభావం ఫలితాలపై చూపే ప్రమాదం ఉంది . ఈ నేపథ్యంలో ఎనిమిది రోజుల పాటు మూడు విడతలుగా ఇవ్వాల్సిన శిక్షణను ఐదు రోజుల పాటు మూడు విడ తల్లో శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం శనివారం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది . మరో రోజు వ్యవధిలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఈవోలతో డీఈవో ప్రత్యేక సమా వేశాన్ని శనివారం నిర్వహించారు . హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా విద్యా శాఖ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది . ఇంగ్లీషు మీడియానికి సంబంధించి ఏమి చేసినా సదరు ఖర్చును అధికారులే భరిం చాలని కోర్టు స్పష్టం చేసిందని అధికారులు అంటున్నారు . అయినా ప్రభుత్వం ఇంగ్లీషు మీడియ అమలుకు కార్యా చరణకు దిగడం , దీనికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని కూడా నియ మించడం గమనార్హం .

శిక్షణ కొనసాగేనా ? 

ఇంగ్లీషు మీడియాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వం తన వంతుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందడుగు వేస్తోంది . ఇటీవల హైకోర్టు ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయవద్దని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది . సోమవారం నుంచి ఉపాధ్యా యులకు శిక్షణ ప్రారంభమైనా మొదటి విడత శిక్షణ పూర్తయ్యేలోగానే ఈ అంశంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే శిక్షణ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని ఉపాద్యాయులు అంటున్నారు . ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం , కౌన్సెలర్లుకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం - నిబంధనలకు విరుద్దమేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి . సత్యనారాయణ అన్నారు . 

1 నుంచి 5 తరగతుల వరకే 

ఇంగ్లీషు మీడియాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . 1 నుంచి 5వ తరగతి వరకు , 1 నుంచి 7వ తరగతి వరకు , ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివే విద్యారులకు ఇంగ్లీషు మీడియంలో బోధన చేయాలని గతంలో ఉత్తర్వు లు జారీ చేశారు . 10వ తరగతి పరీక్షలు మార్చి నెలలో , మిగిలిన తరగతుల పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్న నేపథ్యంలో దాదాపు నెల రోజుల పాటు శిక్షణ కోసం వెళితే ఆయా సబ్జెక్టులలో బోధన , పునశ్చరణ నిలిచిపో తుందని కొన్ని ఉపాధ్యాయ సంఘా నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు . సింగిల్ టీచర్ పని చేసే పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుడు . శిక్షణకు వెళితే అక్కడ ప్రత్యా మ్నాయం చూడాల్సిన అవసరం ఏర్పడింది . విద్యా బోధన ఎలా ఉన్నా , మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేం దుకైనా సింగిల్ టీచర్ పనిచేసే పాఠశాలలో మరో ఉపాధ్యాయుడిని ప్రత్యామ్నాయంగా పంపాల్సిన పరిస్థితి నెలకొంది . ఈ అంశంపై ఉపాధ్యాయ సం ఘాల నాయకుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు శని వారం ఈ ఉత్తర్వుల్లో మార్పులు చేశారు . 1 నుంచి 5వ తరగతి వరకు పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు వారికి కేటాయించిన తేదీల్లో శిక్షణకు హాజరు కావాలని , ఈ శిక్షణ ఐదు రోజుల పాటే ఉంటుందని పేర్కొన్నారు . ఎయిడెడ్ పాఠశాలల్లో . . . . ప్రభుత్వం ప్రవేశపెట్టే ఇంగ్లీషు మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి . 

ఎయిడెడ్ పాఠశాలల్లో 

ఇంగ్లీషు మీడియం ప్రవేశపె డతారా ? లేదా అనే అంశం స్పష్టత లేదు . అయితే ఎయి డెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇచ్చేం దుకు విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Training for teachers from tomorrow"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0