Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Directing awareness programs on education hygiene, alert on corona


  • కరోనాపై  అప్రమత్తమైన విద్యాశాఖ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలకు ఆదేశం 
  • సెలవులపై రాని స్పష్టత 
  • పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు


 ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తు న్న నావెల్ కరోనా వైరస్ ( కోవిద్ - 19 ) విషయంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది . వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన చర్యలను అన్ని పాఠశాలల్లో తీసుకోవాలని సూచనలు జారీ చేసింది . ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి . ప్రతాప్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు . కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం విద్యార్థులందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు . అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ' ఆనంద వేదిక ' కార్యక్రమంలో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు . విద్యార్థులంతా తరచుగా చేతులు శుభ్రపరుచు కోడం ( హ్యాండ్ వాష్ , దగ్గు , తుమ్ములు , జలుబుతో బాధ పడుతున్న విద్యార్థులు తప్పనిసరిగా చేతి రుమాలు ఉపయోగించేలా చూడటం , ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులు సెలవు తీసుకోవడం వంటివి చేయాలని సూచనల్లో పేర్కొన్నారు . 
సెలవులపై సందిగ్ధం
 కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గుంపులు , సమూహాలుగా గుమిగూడటాన్ని నిరోధించడం ముఖ్యం . అందుకోసం దేశవ్యాప్తంగా పాఠశాలలు , విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . అయితే ఈ ఆదేశాలకు పూర్వమే ఢిల్లీ , ఉత్తర్ ప్రదేశ్ , మహారాష్ట్ర , తెలంగాణ , హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులిచ్చాయి . తాజాగా తమిళనాడు , ఒడిశా , కర్ణాటక , ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి . అయితే మన రాష్ట్రంలో మాత్రం సెలవులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది . బుధవారం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు . ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే విద్యాసంసలన్నీ దాన్ని పాటించడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు .

ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం . . . కరోనా వైరస్ నాలుగు దశలు

మొదటి దశ
చైనా , ఇటలీ , ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వైరస్ సోకే అవకాశాలున్నాయి . మన రాష్ట్రం ప్రస్తుతం ఈ దశలో ఉంది . రాష్ట్రంలో నమోదైన ఒకే ఒక్క కేసు ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసిదే . ప్రస్తుతం ఈ యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నాడు.
రెండవ దశ
విదేశాలకు వెళ్లి కరోనా బారిన పడి మనదేశానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోక వచ్చు . ఈ దశను లోకల్ ట్రాన్స్మిషన్ అంటారు . ఈ దశలో బాధితుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశాలుంటాయి . దేశంలోని మహారాష్ట్ర , కర్ణాటక , కేరళ తదితర రాష్ట్రాలు ఈ దశలో ఉన్నాయి .
మూడవ దశ
ఇది ప్రమాదకరమైన దశ .  రెండో దశలో వైరస్ బారిన పడినవారి నుంచి చుట్టు పక్కల వారికి వైరస్ సోకుతుంది .
నాల్గవ దశ
వైరస్ తీవ్రత అమాంతంగా పెరుగుతుంది . బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది . ఇటలీ , ఇరాన్ ప్రస్తుతం ఈ దశలో ఉన్నాయి . చైనా సమర్థవంతంగా వ్యవహరించి ఈ దశలో కరోనా వైరసను చాలా వరకు కట్టడి చేయగలిగింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Directing awareness programs on education hygiene, alert on corona"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0