Janata curfew across the country on Sunday: Modi New Guidelines for the Corona
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు : ప్రధాని మోదీ
కరోనా
- దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు. కరోనాపై మాట్లాడిన మోదీ.. దేశ ప్రజలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
- నేను ఎప్పుడు అడిగిన దేశ ప్రజలు కాదనకుండా చేశారు. నేను ఈసారి కూడా మిమ్మల్ని కొన్ని అడగాలని అనుకుంటున్నాను.. అది మీ జీవితంలో రాబోయే రెండు మూడు వారాలు నాకు కావాలి.
- కరోనా వ్యాప్తి కూడా అంతకంతకూ పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు కరొనాను ధైర్యంగా ఎదుర్కొన్నారు. భారతీయులందరు కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలి
- కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాలేదు.
- ప్రపంచం మొత్తం కరొనాతో పోరాడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, అందరం చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.
- ఈ విషయంలో భారత ప్రజల పాత్ర చాలా కీలకమైనది, కరోనా కట్టడికి అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
- దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవాలి, తమకు కరోనా అంటకుండా, అలాగే ఇతరులకు కూడా కరోనా అంటకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
- రానున్న కొద్ది వారాలు కీలకమన్న మోదీ ఇప్పుడున్న కరోనా కంటే పెద్ద సమస్య లేదని వెల్లడించారు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇంటినుంచి పనులు చేసుకోవాలని సూచించారు.
- అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ ఇళ్లనుంచి బైటికి వెళ్లరాదని సూచించారు. సమూహాలకు దూరంగా ఉండాలని సూచించారు.
- ఏకాంతంగా ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు అని తెలిపారు.
- మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దని.. ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు.
కరోనా
- ప్రధాని మోదీ ప్రసంగంలో కొన్ని అంశాలు
- భారత్ పై కరోనా ప్రభావం లేదనుకోవడం తప్పు.
- గ్రూపులుగా తిరగవద్దు. స్వీయ నియంత్రణ అవసరం.
- సామూహిక కార్యక్రమాలకు దూరంగా వుండండి.
- కుటుంబంలోని సీనియర్ సిటిజన్లందరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దు
- చాలా అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని దేశ ప్రజలందర్ని కోరుతున్నాను.
- ఇంటి నుండే అన్ని పనులు చక్క బెట్టుకోండి.
- కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో సామాజిక దూరం చాలా ముఖ్యమైంది.
- మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఉదయం 7 గంటలనుంచి రాత్రం 9గంటల వరకు దీన్ని పాటిద్దాం.
- 5 సాయంత్రం గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి.
- కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేయాలి.
- నిత్యావసరాలు, అత్యవసర మందుల కొరత రాదు, ఈ విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదు.
- వైద్య, శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు
- కేంద్రం ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాలను తప్పకుండా పాటించాలి.
- కరోనావైరస్ నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- అనేక కష్టసమయాల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇపుడు కూడా ఇలాంటి సంయమనాన్నే ప్రజలు పాటించాలి.
- కరోనా మహమ్మారిపై మానవజాతి తుది విజయం సాధించాలి
0 Response to "Janata curfew across the country on Sunday: Modi New Guidelines for the Corona"
Post a Comment