Ten Examinations as per schedule
షెడ్యూల్ ప్రకారమే పది పరీక్షలు
31 వరకు విద్యా సంస్థలు మూసేయాల్సిందే
ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు
విద్యాశాఖ మంత్రి సురేష్
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసేయాల్సిందేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు , కాలేజీలు , యూనివర్సిటీలు , డీమ్ యూనివర్సిటీలు , కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా విద్యార్థులు , అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బందికి సెలవులు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు . ప్రభుత్వ ఆదేశాలు పాటించని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు . గుంటూరు జిల్లా వెలగపూడి లోని సచివాలయంలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు . కరోనా వైరస్ వ్యాప్త నివారణలో భాగంగా అన్ని రకాల విద్యా సంస్థలను మూసి వేసేందుకు జారీ చేసిన జీఓ నంబరు 37ను పాటించాల్సిందేనన్నారు . యూజీసీ ఆదేశాల మేరకు డీమ్ యూనివర్సిటీలు , సెంట్రల్ యూని వర్సిటీలు తప్పనిసరిగా మూసి వేయాలని చెప్పారు . ఆయన ఇంకా ఏమన్నారంటే . . » ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కొన్ని పాఠ శాలలు , కళాశాలలు , డీమ్ వర్సిటీలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది . వాటిపై చర్యలు తీసుకుంటాం . పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు కొనసాగుతాయి . వీరి సీటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం . పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్థులు జలుబు , జ్వరం , దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తాం . - ఇంటర్ పరీక్షల పేపర్లు దిద్దే అధ్యాపకులకు తగిన జాగ్రత్తలతో వసతులు కల్పిస్తాం .
31 వరకు విద్యా సంస్థలు మూసేయాల్సిందే
ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు
విద్యాశాఖ మంత్రి సురేష్
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసేయాల్సిందేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు , కాలేజీలు , యూనివర్సిటీలు , డీమ్ యూనివర్సిటీలు , కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా విద్యార్థులు , అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బందికి సెలవులు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు . ప్రభుత్వ ఆదేశాలు పాటించని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు . గుంటూరు జిల్లా వెలగపూడి లోని సచివాలయంలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు . కరోనా వైరస్ వ్యాప్త నివారణలో భాగంగా అన్ని రకాల విద్యా సంస్థలను మూసి వేసేందుకు జారీ చేసిన జీఓ నంబరు 37ను పాటించాల్సిందేనన్నారు . యూజీసీ ఆదేశాల మేరకు డీమ్ యూనివర్సిటీలు , సెంట్రల్ యూని వర్సిటీలు తప్పనిసరిగా మూసి వేయాలని చెప్పారు . ఆయన ఇంకా ఏమన్నారంటే . . » ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కొన్ని పాఠ శాలలు , కళాశాలలు , డీమ్ వర్సిటీలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది . వాటిపై చర్యలు తీసుకుంటాం . పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు కొనసాగుతాయి . వీరి సీటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం . పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్థులు జలుబు , జ్వరం , దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తాం . - ఇంటర్ పరీక్షల పేపర్లు దిద్దే అధ్యాపకులకు తగిన జాగ్రత్తలతో వసతులు కల్పిస్తాం .
0 Response to "Ten Examinations as per schedule "
Post a Comment