CM Pics Good News for Students .. Reducing Medical Fees
విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ .. మెడికల్ ఫీజులు తగ్గింపు
రాష్ట్రంలో మెడికల్ విద్య ఫీజులు ప్రభుత్వం తగ్గించింది . ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు .
రాష్ట్రంలో మెడికల్ విద్య ఫీజులు ప్రభుత్వం తగ్గించింది . ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు .
ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలో మెడికల్ విద్య ఫీజులు ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2017-18లో మెడికల్ విద్య ఫీజులను భారీగా పెంచింది. తాజాగా వాటిని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేలా ఫీజుల నిర్ధారించారు. 7.60 లక్షలున్న కన్వీనర్ కోటా ఫీజును 4.32 లక్షలకు తగ్గించారు. డెంటల్ మెడికల్ కాలేజీ ఫీజులను ఇదే తరహాలో తగ్గింపును అమలు చేయనున్నారు. 2023 వరకు వరకు ఇవే ఫీజులు అమలులో ఉండనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏపీ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఫీజులు నిర్ధారించారు.
0 Response to "CM Pics Good News for Students .. Reducing Medical Fees"
Post a Comment