Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Academic plan with technology

టెక్నాలజీ తో అకడమిక్ ప్లాన్
హైటెక్ , లో టెక్ , నో టెక్ వ్యూహాలతో బోధన 
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గారు
Academic plan with technology

 రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ , అకడమిక్ ప్లాన్ , నాడు- నేడు పనుల పూర్తి తదితర అంశాల్లో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది . పాఠశాలల నిర్వహణలో సాంకేతికతను జోడిస్తూ పలు మార్పులు , చేర్పులకు శ్రీకారం చుడుతోంది . రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నా యి . ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే వరకు విద్యార్ధులకు ఆన్లైన్ ద్వారా బ్రిడ్జి కోర్సులు కొనసాగించాలని నిర్ణయించింది . ఈ మేరకు పలు అంశాలతో సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు విడుదల చేశారు . క రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరతిగతిన యూడైస్ డేటానమోదు ప్రక్రియ పూర్తి చేయాలని , ఈ నెల పదో తేదీలోగా పూర్తి కావాలని సూచించారు . అలాగే కరోనా కేసులు అన్ని చోట్ల బయట పడుతుండటంతో పనిదినాలను కుదిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది . ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రాథమిక స్థాయిలో ఒక రోజు , ప్రాథమికోన్నత , ఉన్నత స్థాయి పాఠశాలల్లో రెండు రోజులు ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆదేశించింది . 
హైటెక్ , లో టెక్ , నో టెక్ వ్యూహాలతో బోధన 
విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన కోసం మూడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు . హైటెక్ , లోటెక్ , నోటెక్ పేరుతో బ్రిడ్జి కోర్సుల నిర్వహణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు .
పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరుచునే వరకు ప్రతి వారం ఈ బ్రిడ్జి కోర్సు ద్వారా ఇచ్చిన మెటీరి యల్ ను విద్యార్ధులు పక్కాగా ఫాలో అవుతు న్నారో లేదో ఎప్పటికప్పుడు ఉపాధ్యా యులు పరిశీలన చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది . స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారికి ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు బోధిం చేలా హైటెక్ బోధన ఉంటుంది . ఆ అవకాశం లేని వాళ్లకు దూర దర్శన్ , ఎస్ఎం రేడియో తదితరాల ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠ్యాంశాలు బోధించ డాన్నిలో టెక్ గా వ్యవహరించను న్నారు . ఎటువంటి సాంకేతిక పరికరాలు అందు బాటులో లేని వారికోసం నోటెక్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు . కంప్యూటర్ , నెట్ , ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉన్న విద్యార్థులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉంటుంది . ప్రతి ఉపాధ్యాయుడు 10 నుంచి 20 మంది విద్యార్థులతో నిరంతరం టచ్ లో ఉండి , వారికి తగిన సూచనలు చేయాల్సి ఉంటుంది . ఈ మేరకు జిల్లాల విద్యాశాఖాధి కారులు , రీజినల్ జాయింట్ డైరెక్టర్లు పాఠశాలల నిర్వహణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Academic plan with technology"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0