Waiting for salaries
జీతాలకు ఎదురుచూపులే
ఇంకా ఈ - కుబేరకు చేరని బిల్లులు మంగళవారం సాయంత్రానికి ఖాతాలకు జమ !
ఇంకా ఈ - కుబేరకు చేరని బిల్లులు మంగళవారం సాయంత్రానికి ఖాతాలకు జమ !
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు , ఉపాధ్యాయులు , పింఛన్ దారులకు జూన్ నెల జీతాలు , పింఛన్లు ఇంకా అందలేదు . శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో కొంత ఆలస్యమైంది . తాజాగా 14 రోజుల గడువు దాటి బిల్లు ఆమోదం పొందిన తర్వాతా ప్రక్రియ ఆలస్యమ వుతుండటంతో ఉద్యోగులు , పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు . సోమవారం అందు తాయని ఆశించినా ఖాతాలకు ఇంకా సొమ్ములు జమ కాకపోవడంతో సమాచారం కోసం ఆరా తీస్తున్నారు . గురువారం రాత్రికే బడ్జెట్ కు గవ ర్నరు ఆమోదముద్ర పడి ఉత్తర్వులు వెలువ డ్డాయి . ఈ నేపథ్యంలో ఇతరత్రా కార్యకలాపా లను పూర్తి చేసుకుని సోమవారం నాటికి జీతాలు అందిస్తారని ఉద్యోగులు ఎదురుచూశారు . సోమ వారం మధ్యాహ్నానికీ జీతాలు , పింఛన్ల బిల్లులు రిజర్వు బ్యాంకు ఈ - కుబేరకు చేరలేదు . ఆయా శాఖల బడ్జెట్ ను సీఎస్ఎంఎస్లో అప్లోడ్ చేస్తు న్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు
సాంకేతిక కారణాలవల్లే ఆలస్యం
రాష్ట్రంలో188 మంది విభాగాధిపతులు వారి ఆధ్వర్యంలో 27 వేల మంది డ్రాయింగ్ డిస్బర్స్ మెంట్ అధికారులు ఉన్నారని , ఆయా ఖాతాలకు బడ్జెట్ అప్లోడ్ చేస్తున్నామని అధికారులు చెబు తున్నారు సాంకేతిక కారణాలవల్లే ఆలస్యమవు తోందంటున్నారు . అయితే బడ్జెట్ ఆమోదం పొంది మూడు రోజులు గడిచినా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం విమర్శలను ఎదుర్కొంటోంది . బడ్జెట్ విభాగం నుంచి సీఎస్ఎంఎస్ కు వచ్చిన తర్వాత ప్రక్రియ సాగుతోందని అధికారులు చెబు తున్నారు . వీలైనంత త్వరగా ఈ - కుబేర కు పంపే ఏర్పాట్లలో ఉన్నామని , మంగళవారం సాయంత్రా నికి జీతాలు , పింఛన్లు అందుతాయని ఖజానా శాఖ సంచాలకుడు హన్మంతరావు చెప్పారు .
0 Response to "Waiting for salaries"
Post a Comment