English Medium
ఆంగ్ల మాధ్యమంపై ఏం చేస్తారో?
రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంటుందా సుప్రీంకోర్టులో పోరాడుతుందా?
కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంలో చర్చ
ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల్ని కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ప్రవేశపెట్టాలన్న సర్కారు నిర్ణయాన్ని భాషాభిమానులు, విద్యారంగ నిపుణులు వ్యతిరేకించారు. ఆ ఉత్తర్వులను హైకోర్టు కూడా కొట్టేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేయాలన్న పట్టుదలతో.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతోనైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచన మార్చుకుంటుందా? విద్యారంగం ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి నిర్ణయాధికారం తమకే ఉంటుందంటూ సుప్రీంకోర్టులో పోరాడుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందన కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల భాషావేత్తలు, విద్యా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా జీవో జారీ చేసింది. దీనిపై ఎవరెన్ని అభ్యంతరాలు తెలిపినా ప్రభుత్వ వైఖరి మారలేదు. ఆంగ్లంలో పాఠ్య పుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి పనుల్నీ ప్రారంభించేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని తల్లిదండ్రుల కమిటీలు స్వాగతించాయని, అవసరమైతే మండలానికి ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు రవాణా ఖర్చులు చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ వాదనతో విభేదించిన కోర్టు ఆ జీవోను కొట్టేసింది. కేవలం తల్లిదండ్రుల కమిటీల అభిప్రాయాల్ని.. మొత్తం విద్యార్థులందరి తల్లిదండ్రులకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఎస్సీఈఆర్టీని భాగస్వామిగా చేయకపోవడాన్నీ ఆక్షేపించింది.
ఆ తర్వాత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకున్నామని ఒక నివేదిక విడుదల చేసింది. 96 శాతానికిపైగా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపినట్టు పేర్కొంది. అదే విషయాన్ని తెలియజేస్తూ... హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది.
ఆంగ్ల మాధ్యమ ప్రతిపాదనను విరమించుకోవాలి
కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో ఏముందో ఏడాది క్రితమే బయటకు వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనుకుంది. కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల్ని కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో ఇకపై దేశమంతా ఒకే విధానం అమల్లో ఉంటుంది. తమ ఇష్టం వచ్చినట్టు చేస్తామనడానికి రాష్ట్రానికి హక్కు లేదు. విద్యాభ్యాసం మాతృ భాషలో జరిగినప్పుడే మేధో వికాసం సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
అజ శర్మ, శాసన మండలి మాజీ సభ్యుడు
రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంటుందా సుప్రీంకోర్టులో పోరాడుతుందా?
కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంలో చర్చ
ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల్ని కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ప్రవేశపెట్టాలన్న సర్కారు నిర్ణయాన్ని భాషాభిమానులు, విద్యారంగ నిపుణులు వ్యతిరేకించారు. ఆ ఉత్తర్వులను హైకోర్టు కూడా కొట్టేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేయాలన్న పట్టుదలతో.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతోనైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచన మార్చుకుంటుందా? విద్యారంగం ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి నిర్ణయాధికారం తమకే ఉంటుందంటూ సుప్రీంకోర్టులో పోరాడుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందన కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల భాషావేత్తలు, విద్యా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా జీవో జారీ చేసింది. దీనిపై ఎవరెన్ని అభ్యంతరాలు తెలిపినా ప్రభుత్వ వైఖరి మారలేదు. ఆంగ్లంలో పాఠ్య పుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి పనుల్నీ ప్రారంభించేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని తల్లిదండ్రుల కమిటీలు స్వాగతించాయని, అవసరమైతే మండలానికి ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు రవాణా ఖర్చులు చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ వాదనతో విభేదించిన కోర్టు ఆ జీవోను కొట్టేసింది. కేవలం తల్లిదండ్రుల కమిటీల అభిప్రాయాల్ని.. మొత్తం విద్యార్థులందరి తల్లిదండ్రులకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఎస్సీఈఆర్టీని భాగస్వామిగా చేయకపోవడాన్నీ ఆక్షేపించింది.
ఆ తర్వాత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకున్నామని ఒక నివేదిక విడుదల చేసింది. 96 శాతానికిపైగా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపినట్టు పేర్కొంది. అదే విషయాన్ని తెలియజేస్తూ... హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది.
ఆంగ్ల మాధ్యమ ప్రతిపాదనను విరమించుకోవాలి
కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో ఏముందో ఏడాది క్రితమే బయటకు వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనుకుంది. కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల్ని కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో ఇకపై దేశమంతా ఒకే విధానం అమల్లో ఉంటుంది. తమ ఇష్టం వచ్చినట్టు చేస్తామనడానికి రాష్ట్రానికి హక్కు లేదు. విద్యాభ్యాసం మాతృ భాషలో జరిగినప్పుడే మేధో వికాసం సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
అజ శర్మ, శాసన మండలి మాజీ సభ్యుడు
0 Response to "English Medium"
Post a Comment