Smart TVs in government schools
సర్కారు బడుల్లో స్మార్ట్ టీవీలు
వేల పాఠశాలల్లో ఏర్పాటుకు సన్నాహాలు
రూ.45కోట్లకు టీసీఎల్ కంపెనీకి కాంట్రాక్టు
ఓ కీలక వ్యక్తి సిఫారసుతో టెండర్ ఖరారు?
వేల పాఠశాలల్లో ఏర్పాటుకు సన్నాహాలు
రూ.45కోట్లకు టీసీఎల్ కంపెనీకి కాంట్రాక్టు
ఓ కీలక వ్యక్తి సిఫారసుతో టెండర్ ఖరారు?
- రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో త్వరలో స్మార్ట్ టీవీలు కనిపించనున్నాయి. ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా దాదాపు 10వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
- ఇందుకోసం ఏపీఈడబ్ల్యూఐడీసీ పిలిచిన ఈ-టెండర్లలో టీసీఎల్, మైక్రోమాక్స్ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్ టెండర్లలో ఒక్కో టీవీ ధరను రూ.37వేలకు కోట్ చేసిన టీసీఎల్కు కాంట్రాక్టు ఖరారైంది
- మైక్రోమాక్స్ రూ.76వేలకు కోట్ చేసినందున తక్కువ ధరకు కోట్ చేసిన టీసీఎల్కే టెండర్ ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
- 10వేల టీవీల సరఫరా, సంబంధిత పరికరాల కోసం రూ.45కోట్లు వ్యయం చేయనున్నారు.
- రానున్న 3నెలల్లో టీవీలను స్కూళ్లకు సరఫరా చేయనున్నారు.
- కాగా, ప్రభుత్వ పాఠశాలలకు టీసీఎల్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీల ఆర్డర్ ఖరారు చేయడంలో ఓ కీలక వ్యక్తి సిఫారసు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- ముందస్తుగా ఆ కంపెనీ ప్రతినిధులు సదరు వ్యక్తితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
- ఇదిలా ఉండగా, 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1-6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధనను ప్రవేశపెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం... రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించించిన విషయం విదితమే.
- ఒక్కో ల్యాబ్ ఏర్పాటుకు ఇప్పటికే రూ.లక్ష మంజూరు చేసింది.
- పాఠశాలలోనే ఒక గదిని దీనికోసం ప్రత్యేకించేలా ఆదేశాలు ఇచ్చింది.
- అయితే ఈ ల్యాబ్ల్లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
0 Response to "Smart TVs in government schools"
Post a Comment