AP TEACHERS TRANSFERS 2020
బదిలీల ముంగిట సిఫార్సుల గోల.
రెండు రోజుల్లో 7 ఉత్తర్వులు
ఉపాధ్యాయ వర్గం గరంగరం
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు దగ్గరగా బాధిత ఉద్యోగులు విధి నిర్వహణ కోరుకోవడంలో తప్పులేదు. ఆ కోణంలో బదిలీ కోరుకున్నవారి గురించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి కోరుకున్న చోటికి బదిలీ చేస్తే అభ్యంతరాలు వ్యక్తం కావు. ఇలాంటి బదిలీలను సహచర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయి. కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుతం జిల్లాలో కొన్ని ఉపాధ్యాయుల బదిలీలు ఉండడంపై సహచర ఉద్యోగులు, కొన్ని సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు లేకపోయినా ఇప్పటికే ఒకేచోట 8 ఏళ్ల నుంచి పని చేస్తూ తిరిగి అదే ప్రాంతంలో ఉండడానికి బదిలీ కోరుకుంటే ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయవర్గం మండిపడుతోంది. జిల్లాలో సోమవారం ఒకే రోజు ఐదు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఆ మధ్య 20 దాకా వచ్చాయి. కౌన్సెలింగ్ బదిలీలు చేస్తామని చెబుతూనే మరోవైపు నుంచి ప్రభుత్వం పెద్దఎత్తున సిఫార్సు బదిలీలకు అవకాశం కల్పించడం ఏమిటని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 20 శాతం హెచ్ఆర్ఏ వస్తుందనే ఆశతోనే వారు లాబీయింగ్ ద్వారా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో వచ్చిన ఏడు బదిలీ ఉత్తర్వుల్లో ఆరు 20 శాతం హెచ్ఆర్ఏ పరిధిలోనే ఉన్నాయని విద్యాశాఖవర్గాలు తెలిపాయి.
తాజాగా వచ్చిన ఉత్తర్వులివి..
రెండు రోజుల్లో 7 ఉత్తర్వులు
ఉపాధ్యాయ వర్గం గరంగరం
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు దగ్గరగా బాధిత ఉద్యోగులు విధి నిర్వహణ కోరుకోవడంలో తప్పులేదు. ఆ కోణంలో బదిలీ కోరుకున్నవారి గురించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి కోరుకున్న చోటికి బదిలీ చేస్తే అభ్యంతరాలు వ్యక్తం కావు. ఇలాంటి బదిలీలను సహచర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయి. కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుతం జిల్లాలో కొన్ని ఉపాధ్యాయుల బదిలీలు ఉండడంపై సహచర ఉద్యోగులు, కొన్ని సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు లేకపోయినా ఇప్పటికే ఒకేచోట 8 ఏళ్ల నుంచి పని చేస్తూ తిరిగి అదే ప్రాంతంలో ఉండడానికి బదిలీ కోరుకుంటే ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయవర్గం మండిపడుతోంది. జిల్లాలో సోమవారం ఒకే రోజు ఐదు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఆ మధ్య 20 దాకా వచ్చాయి. కౌన్సెలింగ్ బదిలీలు చేస్తామని చెబుతూనే మరోవైపు నుంచి ప్రభుత్వం పెద్దఎత్తున సిఫార్సు బదిలీలకు అవకాశం కల్పించడం ఏమిటని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 20 శాతం హెచ్ఆర్ఏ వస్తుందనే ఆశతోనే వారు లాబీయింగ్ ద్వారా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో వచ్చిన ఏడు బదిలీ ఉత్తర్వుల్లో ఆరు 20 శాతం హెచ్ఆర్ఏ పరిధిలోనే ఉన్నాయని విద్యాశాఖవర్గాలు తెలిపాయి.
తాజాగా వచ్చిన ఉత్తర్వులివి..
- తాడేపల్లి నుంచి వడ్డేశ్వరం, వడ్డేశ్వరం నుంచి తాడేపల్లికి ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు పరస్పర అంగీకార బదిలీలు తెచ్చుకున్నారు. ఇప్పటికే పని చేస్తున్న పాఠశాలల్లో వారికి 8 ఏళ్ల సర్వీసు పూర్తయింది.
- తాడేపల్లి, మేడికొండూరు నుంచి మరో ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు గుంటూరు రూరల్ మండలానికి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
- బెల్లంకొండ మండలంలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఒకరు గుంటూరు రూరల్కు వచ్చారు.
- నూజెండ్లలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకరు ప్రత్తిపాడు మండలం యనమదలకు ఉత్తర్వు తెచ్చుకున్నారు.
- గుంటూరు మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు పరస్పర అంగీకార బదిలీలు తెచ్చుకున్నారు.
0 Response to "AP TEACHERS TRANSFERS 2020"
Post a Comment