Government students' concern over triple IT exams
రూరల్ వెయిటేజ్ ఎంత?
ట్రిపుల్ ఐటి పరీక్షలుపై ప్రభుత్వ విద్యార్థుల ఆందోళన
లాక్ డౌన్లో జరగని తరగతులు
ట్రిపుల్ ఐటి పరీక్షలుపై ప్రభుత్వ విద్యార్థుల ఆందోళన
లాక్ డౌన్లో జరగని తరగతులు
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్ జీయూకేటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్షపై గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న ప్రభుత్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా పదో తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ఆర్జీయూకేటీ కౌన్సిల్ అడ్మిషన్ల జరిగేవి. కరోనా వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి గ్రేడులు ఇవ్వకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు చేపట్టాలని కౌన్సిల్ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు ట్రిపుల్ ఐటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆ జియుకెట్లను వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం 2008లో ప్రారంభించింది. అయితే ఈ లక్ష్యం నీరుగారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టమని పలువురు భావిస్తున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టినప్పుడు నాలుగు శాతం గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు వెయిటేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు అమలు చేసిన నిబంధనలను కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఇది కేవలం నాలుగు శాతం వెయిటేజ్ మాత్రమే అమలు చేస్తే మాత్రం ఈసారి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తీవ్రం నష్టం కలుగుతుంది. మార్చి 22 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వ విద్యార్థులకు తరగతులు నామమాత్రంగా జరిగి పట్టణాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆ యాజమాన్యాలు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాయి. అయితే పరీక్ష ఓఎంఆర్ పద్ధతి నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విధానంపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తిగా అవగాహన లేదు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు ఒఎంఆర్ షీట్ ద్వారానే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందువల్ల గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.
0 Response to "Government students' concern over triple IT exams"
Post a Comment