Parents to schools in AP ... hardships for students ... everything is written.
ఏపీలో స్కూళ్లకు తల్లిదండ్రులు... విద్యార్థుల కోసం అష్టకష్టాలు... అంతా లిఖితపూర్వకం.
- AP Education: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల చదువుల విషయంలో... పక్కా ఆధారాలతో అడుగులు వేస్తోంది. రేపు ఎప్పుడైనా తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
- ఆంధ్రప్రదేశ్లో నెలల తరబడి మూసేసిన స్కూళ్లను సెప్టెంబర్ 21 మళ్లీ తెరిచారు. 9 నుంచి ఇంటర్ చదివే విద్యార్థులను స్కూళ్లకు రమ్మని ఆర్డరేసింది ఏపీ విద్యా శాఖ.
- కరోనా ఉంది కాబట్టి... విద్యార్థులను స్కూళ్లకు పంపాలా వద్దా అనే దానిపై ఫైనల్ నిర్ణయం తల్లిదండ్రులకే వదిలేసింది ప్రభుత్వం.
- విద్యార్థులు స్కూళ్లకు వస్తే... వాళ్లకు కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని చెబుతూ... ముందుగానే విద్యా శాఖ... స్కూళ్ల గదులను పూర్తిగా శానిటైజ్ చేయించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరిశుభ్రమైన వాతావరణంలో విద్య బోధన జరిగేలా చర్యలు చేపట్టింది.
- ఇవన్నీ చూసిన తల్లిదండ్రులు నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లకు పంపాలని డిసైడవుతున్నారు. ఐతే.. ఇక్కడే ఓ లిటిగేషన్ ఉంది.
- స్కూళ్లకు వచ్చే పిల్లల తల్లితండ్రుల దగ్గర అనుమతి పత్రం తీసుకుంటున్నారు అధికారులు. ఇదేంటంటే... "మా పిల్లల్ని స్కూళ్లకు పంపడానికి మాకు ఏ అభ్యంతరమూ లేదు. మా ఇష్ట ప్రకారమే స్కూళ్లకు పంపుతున్నాం" అని పేరెంట్స్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- అంతే కాదు... పిల్లల్ని స్కూళ్లకు పంపేటప్పుడు... వాళ్లకు కరోనా సోకకుండా... నోటికి మాస్కులు, చేతులకు శానిటైజర్ రాసి, సేఫ్ డిస్టాన్స్ పాటించేలా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రిపేర్ చెయ్యాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తామనేందుకే ఆ డిక్లరేషన్.
- స్కూళ్లకు 9వ తరగతి నుంచి ఇంటర్ పిల్లల్నే అనుమతిస్తున్నారు కాబట్టి... ఆ పిల్లలందరికీ... కరోనాపై ఆల్రైపీ అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్లు సేఫ డిస్టాన్స్ తప్పక పాటిస్తారు. అందువల్ల కరోనా సమస్య తక్కువగానే ఉంటుంది.
- అయినప్పటికీ... రేపు ఏ పిల్లలకైనా కరోనా సోకితే... ప్రభుత్వంపై తల్లిదండ్రులు ఆరోపణలు చేయకుండా ఉండేందుకే విద్యా శాఖ... పేరెంట్స్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటోంది.
- తొలిరోజు అంటే సోమవారం... స్కూళ్లు అంతంతమాత్రంగానే తెరచుకున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల విధులలో ఉన్నవారు తప్ప మిగిలిన ఉపాధ్యాయులు 9, 10 తరగతి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది హాజరయ్యారు.
- ఆన్లైన్ క్లాస్లలో సందేహాలను తీర్చుకోవడానికే స్కూళ్లు తెరిచారు అనే అపోహతో... చాలా మంది 9, 10వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు రాలేదు.
- అన్ని స్కూళ్లలో సేఫ్ డిస్టాన్స్ విధానాలు పాటిస్తున్నారు. శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశారు.
- మంగళవారం నుంచి స్కూళ్లకు విద్యా శాఖ ఆదేశాలతో 50 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే హాజరవుతున్నారు.
- ఇప్పటికీ తల్లిదండ్రులకు పిల్లల్ని స్కూళ్లకు పంపే ఆసక్తి కనిపించట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... కరోనా సోకుతుందేమో అనే భయం వెంటాడుతోంది. మంగళవారం డిక్లరేషన్ ఇచ్చేందుకు తల్లిదండ్రులు స్కూళ్లకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
- ఇలా కరోనా కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, అధికారులు, ప్రభుత్వం... అందరూ ఇబ్బంది పడుతున్నారు.
0 Response to "Parents to schools in AP ... hardships for students ... everything is written."
Post a Comment