Prepare for Village / Ward Secretariat Examinations Hall tickets from 12 p.m.
గ్రామ/వార్డ్ సచివాలయ పరీక్షలకు సిద్ధం
12 నుంచి హాల్ టికెట్లు
పరీక్షల TIME-TABLE
- 16,208 పోస్టుల కోసం 10,63,168 మంది దరఖాస్తు
- 20వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు పరీక్షల నిర్వహణ
- పరీక్ష కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్ షీట్ల ముద్రణ పూర్తి
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ఈనెల 12 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
- మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి.
- ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.
- కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం క్రింద లింక్ ను చూడగలరు.
0 Response to "Prepare for Village / Ward Secretariat Examinations Hall tickets from 12 p.m."
Post a Comment