Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Telangana: Corona tension for teachers

Telangana: టీచర్లకు కరోనా టెన్షన్
వారం రోజుల్లో 400 మందికి వైరస్
ఇళ్ళలోకి రావద్దంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సర్కారుకు రిక్వెస్ట్
Telangana: Corona tension for teachers

డిజిటల్ తరగతులను ప్రారంభిం చేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆగస్ట్ 27 నుంచి ఉపాధ్యాయులను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది . విద్యార్థులను క్లాసులు వినేలా చూడాలని సూచించినప్పటికీ తర్వాత తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని స్పష్టం చేసింది . ఆ రిపోర్ట్ ను రోజూ అధికారులకు ఉపాధ్యాయులు చేరవే యాల్సి ఉంటుంది . ఈ విధులు అప్పగించి శనివారా నికి వారం రోజులు పూర్తయిన నేపథ్యంలో పరిశీలిం చగా టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది . 14 జిల్లాల్లో 400 మంది ఉపా ధ్యాయులు కొత్తగా కరోనా బారిన పడినట్టు “ దిశ " సర్వేలో తేలింది . ఈ గణంకాలను ఆయా జిల్లాల ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ధ్రువీకరించారు . వీరిలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నవారు , 50 ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు . హృద్రోగ , డయాబెటిస్ డయాలసిస్ సమస్యలున్న టీచర్ల ప్రాణాలకు హామీ లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు . మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మందికి కరోనా సోకింది . బయ్యారం మండలంలోని ఓ స్కూల్ లో ముగ్గురు టీచ ర్లు వైరస్ అంటుకుంది . ఉపాధ్యాయులు కరోనా బారి న పడుతుండటంతో స్కూళ్లకు వెళ్లకుండా .. విద్యార్థు లను ఫోన్లలో మానిటరింగ్ చేసే అవకాశం కల్పించా లనీ , పర్క్ ఫ్రం హోం ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు . 
ఇళ్లలోకి రావద్దంటున్న తల్లిదండ్రులు 
ఉపాధ్యాయులు విద్యార్థులను ఫొటోలు తీసేందుకు వెళ్తున్నా పిల్లల తల్లిదండ్రులు రానివ్వడం లేదు . ఎవరి నుంచి వైరస్ అంటుతుందో తెలియని పరిస్థితుల్లో వందల మందిని టీచర్లను కలవాల్సి ఉంటుంది . దీంతో తమకు , పిల్లలకు కూడా కరోనా వస్తుందేమో నని తల్లిదండ్రులు భయపడుతున్నారు . తామే పిల్లలను చూసుకుంటామని , టీచర్లు రావాల్సిన అవసరం లేదని సున్నితంగానే తిరస్కరిస్తున్నారు . రిపోర్టులు రాని సందర్భాల్లో ఉపాధ్యాయులపై అధికారుల ఒత్తిడి పెరగడంతో తగిన పరిష్కారాన్ని చూపించాలని కోరుతు న్నారు . వరంగల్ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి అస్తమా , కిడ్నీ సంబంధ సమస్యలున్నాయి . గురువారం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది . దీంతో ఆ పాఠశాల విద్యార్థుల్లో భయం పెరిగింది . మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని , 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు . మహబూబ్ బాద్ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడు పదేళ్లుగా డయాబె టిక్ సమస్యతో బాధపడుతున్నారు . ఆయనకు కరోనా సోకడంతో హోం క్వారంటైన్లో ఉన్నారు . ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారి హెల్త్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Telangana: Corona tension for teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0