Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Telangana: Corona tension for teachers

Telangana: టీచర్లకు కరోనా టెన్షన్
వారం రోజుల్లో 400 మందికి వైరస్
ఇళ్ళలోకి రావద్దంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సర్కారుకు రిక్వెస్ట్
Telangana: Corona tension for teachers

డిజిటల్ తరగతులను ప్రారంభిం చేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆగస్ట్ 27 నుంచి ఉపాధ్యాయులను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది . విద్యార్థులను క్లాసులు వినేలా చూడాలని సూచించినప్పటికీ తర్వాత తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని స్పష్టం చేసింది . ఆ రిపోర్ట్ ను రోజూ అధికారులకు ఉపాధ్యాయులు చేరవే యాల్సి ఉంటుంది . ఈ విధులు అప్పగించి శనివారా నికి వారం రోజులు పూర్తయిన నేపథ్యంలో పరిశీలిం చగా టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది . 14 జిల్లాల్లో 400 మంది ఉపా ధ్యాయులు కొత్తగా కరోనా బారిన పడినట్టు “ దిశ " సర్వేలో తేలింది . ఈ గణంకాలను ఆయా జిల్లాల ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ధ్రువీకరించారు . వీరిలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నవారు , 50 ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు . హృద్రోగ , డయాబెటిస్ డయాలసిస్ సమస్యలున్న టీచర్ల ప్రాణాలకు హామీ లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు . మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మందికి కరోనా సోకింది . బయ్యారం మండలంలోని ఓ స్కూల్ లో ముగ్గురు టీచ ర్లు వైరస్ అంటుకుంది . ఉపాధ్యాయులు కరోనా బారి న పడుతుండటంతో స్కూళ్లకు వెళ్లకుండా .. విద్యార్థు లను ఫోన్లలో మానిటరింగ్ చేసే అవకాశం కల్పించా లనీ , పర్క్ ఫ్రం హోం ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు . 
ఇళ్లలోకి రావద్దంటున్న తల్లిదండ్రులు 
ఉపాధ్యాయులు విద్యార్థులను ఫొటోలు తీసేందుకు వెళ్తున్నా పిల్లల తల్లిదండ్రులు రానివ్వడం లేదు . ఎవరి నుంచి వైరస్ అంటుతుందో తెలియని పరిస్థితుల్లో వందల మందిని టీచర్లను కలవాల్సి ఉంటుంది . దీంతో తమకు , పిల్లలకు కూడా కరోనా వస్తుందేమో నని తల్లిదండ్రులు భయపడుతున్నారు . తామే పిల్లలను చూసుకుంటామని , టీచర్లు రావాల్సిన అవసరం లేదని సున్నితంగానే తిరస్కరిస్తున్నారు . రిపోర్టులు రాని సందర్భాల్లో ఉపాధ్యాయులపై అధికారుల ఒత్తిడి పెరగడంతో తగిన పరిష్కారాన్ని చూపించాలని కోరుతు న్నారు . వరంగల్ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి అస్తమా , కిడ్నీ సంబంధ సమస్యలున్నాయి . గురువారం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది . దీంతో ఆ పాఠశాల విద్యార్థుల్లో భయం పెరిగింది . మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని , 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు . మహబూబ్ బాద్ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడు పదేళ్లుగా డయాబె టిక్ సమస్యతో బాధపడుతున్నారు . ఆయనకు కరోనా సోకడంతో హోం క్వారంటైన్లో ఉన్నారు . ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారి హెల్త్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Telangana: Corona tension for teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0