UPI Payment: Good news for those who have made Google Pay and PhonePay payments.
UPI Payment : గూగుల్ పే , ఫోన్పే పేమెంట్స్ చేసినవారికి గుడ్ న్యూస్.
మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? పేమెంట్స్ కోసం ఫోన్పే వాడుతున్నారా? పేటీఎం యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూపీఐ లావాదేవీలపై మీరు చెల్లించిన ఛార్జీలన్నీ వెనక్కి రానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జరిపిన యూపీఐ లావాదేవీలన్నింటికీ ఇది వర్తిస్తుంది. పీఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిపిన పేమెంట్స్కి మర్చంట్ డిస్కౌంట్ రేట్ సహా ఎలాంటి ఛార్జీలు వర్తించవు అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేట్ బ్యాంకులు యూపీఐ పేమెంట్స్కు వసూలు చేస్తున్న ఛార్జీలను ఎత్తేశాయి. ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరిపేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో జరిపిన యూపీఐ లావాదేవీలకు వసూలు చేసిన ఛార్జీలను రీఫండ్ చేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకుల్ని ఆదేశించింది.
మీరు ఈ ఏడాదిలో జరిపిన యూపీఐ పేమెంట్స్కి ఛార్జీలు చెల్లించినట్టైతే రీఫండ్ లభిస్తుంది. బ్యాంకులు మీ అకౌంట్లలోకి ఈ ఛార్జీలను రీఫండ్ చేయనున్నాయి. ఇలా ఛార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.50 కోట్లకు పైనే ఉందని అంచనా. ఆ మొత్తం త్వరలో లావాదేవీలు జరిపినవారి అకౌంట్లలోకి వెళ్లనున్నాయి. రూపే, యూపీఐ, భీమ్ యూపీఐ, యూపీఐ క్విక్ రెస్పాన్స్ కోడ్ లాంటి పేమెంట్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంకులు యూపీఐ ఛార్జీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు గత మూడు నాలుగు నెలలుగా ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. నెలలో 20 లావాదేవీల కన్నా ఎక్కువ జరిపినట్టైతే రూ.2.5 నుంచి రూ.5 మధ్య వసూలు చేశాయి. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT సర్క్యులర్తో ఆ ఛార్జీలను ఎత్తేయాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు యూపీఐ ట్రాన్సాక్షన్స్పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు.
మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? పేమెంట్స్ కోసం ఫోన్పే వాడుతున్నారా? పేటీఎం యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూపీఐ లావాదేవీలపై మీరు చెల్లించిన ఛార్జీలన్నీ వెనక్కి రానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జరిపిన యూపీఐ లావాదేవీలన్నింటికీ ఇది వర్తిస్తుంది. పీఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిపిన పేమెంట్స్కి మర్చంట్ డిస్కౌంట్ రేట్ సహా ఎలాంటి ఛార్జీలు వర్తించవు అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేట్ బ్యాంకులు యూపీఐ పేమెంట్స్కు వసూలు చేస్తున్న ఛార్జీలను ఎత్తేశాయి. ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరిపేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో జరిపిన యూపీఐ లావాదేవీలకు వసూలు చేసిన ఛార్జీలను రీఫండ్ చేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకుల్ని ఆదేశించింది.
మీరు ఈ ఏడాదిలో జరిపిన యూపీఐ పేమెంట్స్కి ఛార్జీలు చెల్లించినట్టైతే రీఫండ్ లభిస్తుంది. బ్యాంకులు మీ అకౌంట్లలోకి ఈ ఛార్జీలను రీఫండ్ చేయనున్నాయి. ఇలా ఛార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.50 కోట్లకు పైనే ఉందని అంచనా. ఆ మొత్తం త్వరలో లావాదేవీలు జరిపినవారి అకౌంట్లలోకి వెళ్లనున్నాయి. రూపే, యూపీఐ, భీమ్ యూపీఐ, యూపీఐ క్విక్ రెస్పాన్స్ కోడ్ లాంటి పేమెంట్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంకులు యూపీఐ ఛార్జీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు గత మూడు నాలుగు నెలలుగా ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. నెలలో 20 లావాదేవీల కన్నా ఎక్కువ జరిపినట్టైతే రూ.2.5 నుంచి రూ.5 మధ్య వసూలు చేశాయి. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT సర్క్యులర్తో ఆ ఛార్జీలను ఎత్తేయాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు యూపీఐ ట్రాన్సాక్షన్స్పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు.
0 Response to "UPI Payment: Good news for those who have made Google Pay and PhonePay payments."
Post a Comment