AP Samagra Siksha-Quality Education -Reading Literacy Campaign-Issue of guidelines on preparatory activities of the campaign-Reg.
AP Samagra Siksha-Quality Education -Reading Literacy Campaign-Issue of guidelines on preparatory activities of the campaign-Reg.
Rc.No.001/Director RMSA/SSAP Dated: 21-10-2020.
పాఠశాలల్లో గ్రంథాలయాలకు కొత్తరూపు - 26 నుంచి కార్యాచరణ అమలు
- విద్యార్థుల్లో పఠనాభిలాషను పెంపొందించేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాచరణను ప్రకటించింది.
- నాణ్యమైన విద్య, అక్షరాస్యతను పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.
- ప్రతి విద్యార్థి తన తరగతి స్థాయికి పఠనాభిలాషను కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
- జాతీయ స్థాయిలో ‘మేము చదవటాన్ని ఇష్టపడతాం’ (వి లవ్ రీడింగ్) కార్యక్రమాన్ని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు చేయనున్నారు.
- చదివే వాతావరణాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత, ఉద్యోగ విరమణ చేసిన వారు, విద్యావేత్తలు, ఎన్జీవోల సహకారంతో కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు.
కార్యక్రమం ఇలా... :
- ఈ నెల 26న చిరిగిన పుస్తకాల్ని సరిచేయాలి.
- 27న పాఠశాలల్లో అందుబాటులో ఉన్న పుస్తకాల్ని వరుస క్రమంలో సర్దాలి.
- 28న ప్రతి తరగతిలో గ్రంథాలయ పుస్తకాలను అందుబాటులో ఉంచాలి.
- 30న పాఠశాలలో పుస్తకాలను ఒక బుక్ బ్యాంకుగా ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేయాలి.
- 31న కథలు చెప్పే సామర్థ్యం ఉన్న వారిని గుర్తించాలి.విద్యార్థులు సెలవు దినాల్లో గ్రామంలో ఉన్న కమ్యూనిటీ రీడింగ్ కేంద్రాలకు వెళ్లి చదివే విధంగా ప్రోత్సహించాలి
0 Response to "AP Samagra Siksha-Quality Education -Reading Literacy Campaign-Issue of guidelines on preparatory activities of the campaign-Reg."
Post a Comment