AP TEACHERS TRANSFERS 2020
ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన సిగ్నల్
రెండు, మూడు రోజుల్లో జీవో జారీ
వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధులతో వైద్యం పొందుతున్న వారికి తొలి ప్రాధాన్యం
ఉపాధ్యాయుల బదిలీకి సీఎం జగన గ్రీనసిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి 2017లో బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే స్కూల్లో ఎనిమిదేళ్లకు పైబడి పనిచేస్తున్న వారంతా స్థాన మార్పుల కోసం వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి గత నెల 18లోగా ఉపాధ్యాయుల రేషనలైజేషన పూర్తి చేయాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ నుంచి డీఈవోలకు ఉత్తర్వులందాయి. బదిలీలకు అర్హులైన జాబి తా డీఈవో కార్యాలయం తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. అదే నెలలో బదిలీ ప్రక్రియ పూర్తి చేయడానికి జిల్లా విద్యాశాఖ సమాయత్తమైంది. ఆనలైనలో బదిలీ కౌన్సెలింగ్ చేయడానికి సిద్ధపడినా, కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో తతంగాన్ని తాత్కలికంగా వాయిదా వేశారు. కొవిడ్ ఉధృతి తగ్గుతుండడంతో బదిలీలు జరగను న్నాయి. ఇప్పుడు నిర్వహించే బదిలీల్లో వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధులతో వైద్యం పొందుతున్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లా పరిషత, మండల పరిషత, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను విభజించనున్నారు. ఇందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఆయా పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలను యునిఫైడ్ డిస్ర్టిట్ ఇనఫర్మేషన సిస్టం ఫర్ ఎడ్యుకేషన (యూడైస్) ఆధారంగా సేకరించనున్నారు. ఈ బదిలీల్లో పాఠశాలలున్న ప్రాంతం, ఉపాధ్యాయులు తీసుకుంటున్న హెచఆర్ఏ పరిగణలోకి తీసుకుని 4 కేటగిరీలుగా జాబితా సిద్ధం చేయనున్నారు. గత నెల 31 నాటికి ఒకేచోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన నిబంధనలను ఇప్పుడు కూడా అమలు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆనలైనలో నిర్వహిస్తారు
0 Response to "AP TEACHERS TRANSFERS 2020"
Post a Comment