Jagananna Vidyakanuka
కిట్లు ... ఇక్కట్లు
- తల్లుల బయోమెట్రిక్ ఆటంకం
- 50 శాతానికి మించని జేవీకే కిట్ల బట్వాడా
- ఒక్కో స్కూలకు ఒకే ట్యాబ్ ఉండటం వల్లే
- మాన్యువల్ గా ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు.
జగనన్న విద్యా కానుక ( జేవీకే ) కిట్ల పంపిణీకి బయోమెట్రిక్ (విద్యార్థుల తల్లులకు) ఆటంకంగా మారుతోంది . కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా వైరస్ అన్లాక్ -5 మార్గద ర్శకాల ప్రకారం తొమ్మిది , పది తరగతుల విద్యార్థులకు ఇప్పటికే క్లాసులు ప్రారంభమ య్యాయి . వచ్చే నెల రెండో తేదీ నుంచి కొవిడ్ నిబంధనల మేరకు మిగిలిన విద్యార్థులకు తరగతులు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది . ఇప్పటికే విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఈ మేరకు ప్రకటన చేశారు . అప్పటికల్లా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు , నోటు పుస్తకాలు , యూనిఫాం , బూట్లు , బెల్ట్ తో కూడిన జేవీకే కిట్ల పంపిణీని పూర్తి చేయాల్సి ఉంది . ఈ నెల ఎనిమిదిన సీఎం వైఎస్ జగన్ కిట్ల పంపిణీని ప్రారంభించగా , తొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో రోజుకు వంద మంది చొప్పున కిట్ల పంపిణీ జరుగుతోంది . వారం రోజులలో 13 జిల్లాల్లో 50 శాతమే కిట్ల పంపిణీ జరిగింది . రాష్ట్రంలో మొత్తం 37,92,650 మందికి కిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . తల్లుల బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే కిట్లు అందజేస్తున్నారు . ఒక్కో స్కూల్ కు ఒక ట్యాబ్ మాత్రమే ఉండటంతో పంపిణీలో తీవ్ర జాష్యం జరుగుతోంది . దీనికితోడు నెట్ వర్క్ సమస్య పంపిణీకి ఆటంకంగా మారుతోందని పలువురు ప్రధానోపాధ్యాయులు , మండల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు . మొత్తం 37.92 లక్షల మంది విద్యార్ధులకుగానూ ఇప్పటి వరకు 17.97 లక్షల మంది తల్లుల బయోమెట్రిక్ మాత్రమే పూర్తయింది . రాష్ట్రంలో సగటున 47.39 శాతం మంది విద్యార్థులకే జేవీకే కిట్స్ పంపిణీ పూర్తయినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి . జేవీకే కిట్లను మాన్యువల్ విధానంలో పంపిణీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు అధికారులకు సూచించినప్పటికీ , యాప్ లో బయోమెట్రిక్ తీసుకున్నాకే పంపిణీ చేస్తున్నారు . తరగతుల వారీగా పుస్తకాలకు ఒకసారి , జేవీకే కిలకు ఒకసారి బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తోంది . ఒక్కోసారి పావు గంట నుంచి అరగంట వరకు బయోమెట్రిక్ పడటం లేదు . దీంతో కొన్ని స్కూళ్లలో ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నా , అదీ మొరాయిస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు . ఈ నేపథ్యంలో కిట్లను మాన్యువల్ విధానంలో పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు .
అనంతపురం టాప్ , విశాఖ లీస్ట్
జేవీకే కిట్ల పంపిణీలో అనంతపురం జిల్లా టాప్ లో ఉంటే , విశాఖ జిల్లా చివరి స్థానంలో ఉంది . అనంతపురంలో అత్యధికంగా 58.23 శాతం కిట్ల పంపిణీ జరగ్గా , విశాఖలో 33.24 శాతమే పూర్తయింది . సీఎం సొంత జిల్లా కడపలో 39.21 శాతం కిట్ల పంపిణీ జరిగింది . దీంతో ఆ జిల్లా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది . గుంటూరు 57.52 శాతంతో రెండో స్థానంలో ఉండగా , 52.64 శాతంతో చిత్తూరు మూడోస్థానంలో ఉంది . కర్నూలులో అత్యధికంగా 4,09,698 మంది విద్యార్థులు ఉండగా , 2,13,048 మంది ( 52 శాతం ) తల్లుల బయోమెట్రిక్ పూర్తవ్వగా , ఆ జిల్లా నాలుగో స్థానంలో ఉంది . తూర్పు గోదావరిలో 3,88,435 మంది విద్యార్థులుంటే , 1.75,878 మంది ( 45.28 శాతం ) తల్లులకే బయోమెట్రిక్ పూర్తయింది . విద్యాశాఖ ప్రధాన కార్యాలయం ఉన్న కృష్ణాజిల్లాలో 2,56,546 మంది విద్యార్థులుంటే , 1,04,482 ( 40.73 శాతం ) తల్లులకే బయోమెట్రిక్ ను పూర్తి చేసి కిట్లు పంపిణీ చేశారు . నవంబరు రెండు నుంచి స్కూళ్లను ప్రారంభించనుండగా , ఆలోగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది . కార్పొరేట్ స్కూళ్ల తరహాలో యూనిఫాం కుట్టించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది . సకాలంలో కిట్లు పంపిణీ చేయకపోతే యూనిఫాంలను కుట్టించుకోవడం ఆలస్యమయ్యే అకాశం కూడా ఉంది .
జిల్లాలవారీగా JVK కిట్ల పంపిణీ వివరాలు
0 Response to "Jagananna Vidyakanuka"
Post a Comment