Money in Accounts by November 5th
Money in Accounts by November 5th
' చక్రవడ్డీ ' పై బ్యాంకులకు ఆర్ బీఐ ఆదేశాలు సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం వెల్లడి ముంబై | న్యూఢిల్లీ : మారటోరియంలో రుణాలపై చక్రవడ్డీ మాఫీ పథకాన్ని నవంబర్ 5 లోగా అమలు చేయాలని బ్యాంకులు , నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది . స్కీమ్ కి అనుగుణంగా సాధారణ వడ్డీ , చక్రవడ్డీ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తాన్ని నిర్దిష్ట రుణగ్రహీతల ఖాతాల్లో గడువులోగా జమ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది . ' రుణాలిచ్చే అన్ని ఆర్థిక సంస్థలు నిర్దిష్ట స్కీమ్ . కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారుల నుండి ఉద్యోగుల వరకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రూ .2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని ( వడ్డీపై వడ్డీ ) మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే . ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది . ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంకులు , ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది . నిర్దేశించిన సమయంలోగా బ్యాంకులు దీనిని అమలు చేయాలని తెలిపింది .
నవంబర్ 5 లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ
లోను మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీని వసూలు చేస్తామని , వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని భారత అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం అఫిడవిట్ సమర్పించింది . మారటోరియం 6 నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ , సాధారణవడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5 లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయనున్నారు . బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయగా , తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు దానిని అందిస్తుంది . మారటోరియం కాలంలో ఈఎంఐలపై చక్ర వడ్డీ కాకుండా సాధారణ వడ్డీనే వసూలు చేయాలని ఈ వ్యత్యాసాన్ని అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా , 21 న కేబినెట్ ఆమోదించింది . రూ .2 కోట్లలోపు రణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది .
మాఫీ వీరికే
మార్చి 1 వ తేదీ నుండి ఆగస్ట్ 31 వ తేదీ వరకు ప్రకటించిన మారటోరియంపై చక్రవడ్డీ మాఫీ ఉంటుంది . ఈ ఏడాది ఫిబ్రవరి 29 వ తేదీ నాటికి రూ .2 కోట్ల లోపు రుణఖాతాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు . చక్రవడ్డీ మాఫీ వర్తించాలంటే ఫిబ్రవరి 29 వ తేదీ నాటికి సదరు రుణ ఖాతా మొండి బకాయిగా ఉండరాదు . హోమ్ లోన్ , హౌసింగ్ లోన్ , ఎంఎస్ఎంఈ రుణాలతో పాటు వినియోగ రుణాలు , గృహోపకరణాల కొనుగోలు రుణాలు , క్రెడిట్ కార్డు బకాయిలు చక్రవడ్డీ మాఫీ పథకం పరిధిలోకి వస్తాయి . సాధారణ వడ్డీకి , చక్రవడ్డీకి మధ్య తేడా నగదును బ్యాంకులు , ఆర్థిక సంస్థలు అర్హులైన రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలి . నవంబర్ 5 వ తేదీలోగా ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలి . జమ చేసిన ఈ సొమ్మును కేంద్రం భరిస్తుంది . కేంద్రం రుణదాతలకు ఇస్తుంది . ప్రభుత్వరంగ , ప్రైవేటురంగ బ్యాంకులు , నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు , హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు , సహకార బ్యాంకులు , గ్రామీణ బ్యాంకుల నుండి రుణాలు తీసుకు వారు అందరూ అర్హులే
పండుగ గిఫ్ట్
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించింది . ఆ తర్వాత రెండోసారి జూన్ నెలలో మరో మూడు నెలల పాటు మారటోరియాన్ని పొడిగించింది . ఈ మారటోరియం కాలానికి గాను చక్రవడ్డీ వసూలు చేయరాదని పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు . వడ్డీపై వడ్డీని వెనక్కి తీసుకుంటామని కేంద్రం తెలిపింది . అయితే చక్రవడ్డీపై కేంద్రం నిర్ణయం ఆలస్యమవుతుండటంతో త్వరగా నిర్ణయం తీసుకోవాలని , ప్రజల దీపావళి మీ చేతుల్లో ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది . త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 14 న కేంద్రం , ఆర్బీఐకి సూచించింది . కేంద్రం మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు పై మారదర్శకాలు జారీ చేసింది .
0 Response to "Money in Accounts by November 5th"
Post a Comment