Schools start from November 2nd
నవంబరు 2 నుంచి బడులు ప్రారంభం
- పాఠశాలల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు
- ఒక పూటే తరగతులు
- విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం
- డిసెంబరులో పరిస్థితిని సమీక్షించి మార్పులు
పాఠశాలల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది వచ్చే నెల 2వ తేదీ నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించింది. ఆ ప్రకారం విద్యార్థులకు రోజు మార్చి రోజు తరగతులు నిర్వహిస్తారు. పాఠశాలలు ఒక పూట మాత్రమే పనిచేస్తాయి. మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇళ్లకు పంపుతారు. ప్రతిరోజు సగం మంది విద్యార్థులను మాత్రమే పాఠశాలలలకు అనుమతిస్తారు. 1,35,7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరోరోజు తర గతులు నిర్వహిస్తారు. ఒక్కో విద్యార్థి వారంలో మూడు రోజులు పాఠశాలకు హాజరవు తారు. విద్యార్థుల సంఖ్య 750 పైగా ఉంటే తరగతులను మూడు రోజులకు ఒకసారి నిర్వ హిస్తారు. నవంబరు నెల మొత్తం ఇది అమలవుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపకపోతే వారి కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలి. ఉపాధ్యాయులు మాత్రం అందరూ ప్రతి రోజూ హాజరు కావాలి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ప్రతి తర గతి గదిలో 16 నుంచి 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టాలి. ప్రతిరోజూ ఒక సెషన్ కోవిడ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. డిసెంబరులో పరిస్థితిని సమీక్షించి నెలలో పాఠశాల నిర్వహణపై తగు చర్యలు తీసుకుంటారు.
0 Response to "Schools start from November 2nd"
Post a Comment