The process of school rationalization that began
ప్రారంభమైన పాఠశాలల హేతుబద్దీకరణ ప్రక్రియ
ప్రక్రియ సాగేదిలా.
- ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 60 మంది వరకూ ఇద్దరు, 90 మంది వరకూ ముగ్గురు, 120 మంది వరకూ నలుగురు, 150 మంది వరకూ ఐదుగురు ఎస్జీటీలు ఉంటారు. విద్యార్థులు 200 మంది వరకూ ఉంటే ఐదుగురు ఎస్జీటీలు, ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉంటారు.
- ఒక పాఠశాలలో 0 ఎన్రోల్మెంట్ ఉంటే ఆ పాఠశాలలోని పోస్టులు వేరే పాఠశాలకు బదిలీ చేస్తారు. కానీ పాఠశాల రద్దు కాదు.
- 151 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉండి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టు ఉంటే దానికి ఎస్జీటీ గా భావించాలి.
- హేతుబద్దీకరణలో ఎల్ఎఫ్ఎల్ పోస్టుకు బదులుగా ఎస్జీటీ పోస్టును చూపుతారు.
- ఉర్దూ పోస్టులను తెలుగు పోస్టులను కలపకుండా విడిగా చూపుతారు.
- ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు (6, 7 తరగతులు) ఉంటే అక్కడ గల పాఠశాల సహాయకుల పోస్టులను సర్ప్లస్ గా చూపుతారు.
- ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు (6, 7, 8 తరగతులు) ఉంటే అక్కడ గల పాఠశాల సహాయకుల పోస్టులను సర్ప్లస్గా చూపుతారు.
0 Response to "The process of school rationalization that began"
Post a Comment