Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Approval of new sand policy ... Government to withdraw from distribution ...

 నూతన ఇసుక విధానానికి ఆమోదం ... పంపిణీ నుంచి తప్పుకోనున్న ప్రభుత్వం ...

Approval of new sand policy ... Government to withdraw from distribution ...

నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీచ్​లను ఒకే సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రీచ్‌లను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని కేబినెట్ నిర్ణయించింది.

కొత్త ఇసుక పాలసీకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీచ్​లను ఒకే సంస్థకు అప్పగించాలన్న కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తొలుత ఇసుక రీచ్​ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేవీ ముందుకు రాకుంటే ప్రముఖ సంస్థలకు, ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేటు సంస్థకు అప్పగించాల్సిన పక్షంలో ఓపెన్ టెండర్ ద్వారా ప్రక్రియ చేపట్టాలని మంత్రి వర్గం ఉప సంఘం సిఫార్సు చేసింది. మంత్రి వర్గం ఉప సంఘం సిఫార్సులను చర్చించి మంత్రివర్గం ఆమోదించింది.

అగ్నిమాపక శాఖలో నాలుగు జోన్​ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు రెండు జోన్లుగా ఉన్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలో పాలనా సౌలభ్యం కోసం నాలుగు జోన్లుగా విభజన చేసేందుకు ఆమోదముద్ర వేసింది. కొన్ని జైలు సూపరిండెంట్ పోస్టుల భర్తీకి అంగీకరించింది. కర్నూలు జిల్లా అదోనిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులు వెనక్కి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్​కు చట్ట బద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లు ఆమోదంపై మంత్రివర్గం చర్చించింది. ఏపీఎస్డీసీ ద్వారా 25వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి 6వేల కోట్ల రూపాయల రుణం సేకరణకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఏపీఎస్డీసీ ద్వారా సమీకరించిన నిధుల ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించారు.

మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై కేబినెట్ లో చర్చ జరిగింది. పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5,700 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తేదీలు ఖరారు కాలేదు. ఈ నెలలోనే శాసనసభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Approval of new sand policy ... Government to withdraw from distribution ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0