The third DA was determined to be 5.24 percent
The third DA was determined to be 5.24 percent
మూడో డీఏ 5.24శాతం గా నిర్ణయo
మంత్రి మండలి ఆమోదం
ఉద్యోగులకు 2019 జులై నుంచి పెండింగులో ఉన్న కరవు భత్యం
5.24శాతం మేర చెల్లించాలని రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయించింది.
పెండింగులో ఉన్న మూడు డీఏలలో తొలి రెండు 3.144శాతంగాను, మూడో డీఏ
5.24శాతంగా రాష్ట్ర మంత్రి మండలి
శుక్రవారం ఆమోదించింది.
మంత్రిమండలి నిర్ణయాలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు చెప్పారు.
తొలి డీఏ అరియర్స్ 30 నెలలవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.2018జులై నుంచి ఇవ్వాల్సిన డీఏ అరియర్స్ భారం రూ.3017 కోట్లుగా పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి జీతాలు, పెన్షన్లతో పాటు నగదు రూపంలో చెల్లిస్తామన్నారు.
ఈ డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై భారం రూ.1,206.96 కోట్లు పడుతుందని చెప్పారు.2019 జవనరి నుంచి పెండింగులో ఉన్న డీఏ అమలు వల్ల కూడా ఇదే మొత్తాలు ఖర్చవుతాయని పేర్కొన్నారు.
2019 జులై నుంచి అమలు చేయాల్సిన
డీఏ 5.24శాతం చొప్పున ఇవ్వాలని
నిర్ణయించినట్లు పేర్కొంటూ అరియర్స్
భారం రూ.5,028.90 కోట్లు పడుతుందన్నారు.
3వ DA వల్ల ఏడాదికి ప్రభుత్వానికి రూ.2,011.56 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. మొత్తం మూడు డీఏల అరియర్స్ భారంరూ.11 వేల కోట్ల పై మాటే అని కన్నబాబు చెప్పారు.
thanks for latest updates Asirwad
ReplyDelete