Postpone the exams .. Reduce the syllabus!
పరీక్షలు వాయిదా వేయండి.. సిలబస్ తగ్గించండి!
కేంద్ర విద్యాశాఖకు ఆన్లైన్లో విద్యార్థుల విజ్ఞప్తి
10న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కేంద్రమంత్రి చర్చ
COVID 19 పరిస్థితులతో 2021లో పరీక్షల సంగతి ఏమిటో ఎవరికీ అర్థంకావడంలేదు. విద్యారంగంలో నెలకొన్న ఈ అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ నెల 10న ఉదయం 10గంటలకు ఆన్లైన్ చర్చా వేదిక ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాదిలో నిర్వహించాల్సిన సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షల నిర్వహణపై కీలకంగా చర్చించనున్నారు.
ఇందుకోసం EducationMinisterGoesLive హ్యాష్ట్యాగ్ ద్వారా ఆయా వర్గాల నుంచి ప్రశ్నలను, సలహాలు, అభిప్రాయాలను ఆహ్వానించారు.
వాస్తవానికి డిసెంబర్ 3న ఈ వెబినార్ జరగాల్సి ఉన్నప్పటికీ ఈ నెల 10కి వాయిదా పడింది.
0 Response to "Postpone the exams .. Reduce the syllabus!"
Post a Comment