Rs. 2000 Note Bandh .. Central Government given by Clarity
రూ . 2000 నోటు బంద్ .. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
రెండు వేల రూపాయల నోటును కేంద్రం రద్దు చేయబోతోందనే వార్త గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. రూ. 2000 నోటును ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకులకు సరఫరా చేయడం పూర్తిగా నిలిపేసిందన్నది ఆ వార్త సారాంశం. ఈ కారణంగానే చాలా బ్యాంకు ఏటీఎంలలో కేవలం వంద, రెండు, ఐదు వందల రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయని ఆ వార్త పేర్కొంది. అంతేకాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు తమ ఏటీఎంలలో రూ. 2000 నోటును అమర్చే విధానానికి కూడా స్వస్తి చెప్పాయని ఈ వార్తలో ఉంది. దీంతో చాలామంది దీనిపై ఆందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరహాలోనే.. కేంద్రం మరోసారి రూ.2000 నోటును రద్దు చేయనుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ఈ వార్తపై కేంద్రం వివరణ ఇచ్చింది. బ్యాంకులకు ఆర్బీఐ రూ. 2000 నోటు సరఫరా నిలిపి వేయలేదని వివరించింది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది.
0 Response to "Rs. 2000 Note Bandh .. Central Government given by Clarity"
Post a Comment