Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rs. 2000 Note Bandh .. Central Government given by Clarity

  రూ . 2000 నోటు బంద్ .. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Rs. 2000 Note Bandh .. Central Government given by Clarity

రెండు వేల రూపాయల నోటును కేంద్రం రద్దు చేయబోతోందనే వార్త గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. రూ. 2000 నోటును ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకులకు సరఫరా చేయడం పూర్తిగా నిలిపేసిందన్నది ఆ వార్త సారాంశం. ఈ కారణంగానే చాలా బ్యాంకు ఏటీఎంలలో కేవలం వంద, రెండు, ఐదు వందల రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయని ఆ వార్త పేర్కొంది. అంతేకాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు తమ ఏటీఎంలలో రూ. 2000 నోటును అమర్చే విధానానికి కూడా స్వస్తి చెప్పాయని ఈ వార్తలో ఉంది. దీంతో చాలామంది దీనిపై ఆందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరహాలోనే.. కేంద్రం మరోసారి రూ.2000 నోటును రద్దు చేయనుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ఈ వార్తపై కేంద్రం వివరణ ఇచ్చింది. బ్యాంకులకు ఆర్‌బీఐ రూ. 2000 నోటు సరఫరా నిలిపి వేయలేదని వివరించింది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rs. 2000 Note Bandh .. Central Government given by Clarity"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0