Seventh installment dry ration
ఏడో విడత డ్రై రేషన్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏడో విడత డ్రై రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
'జగనన్న గోరుముద్ద' పథకంలో భాగంగా విద్యార్థుల ఇంటికే సరకులు అందజేయాలని బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నవంబర్ నెలకు సంబంధించి 24 రోజుల పనిదినాలను లెక్కగట్టి, ఆ మేరకు డ్రై రేషన్ అందజేయాలనే ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
లాక్ డౌన్ మొదలు ఇప్పటి వరకు ఆరు సార్లు విద్యార్థుల ఇంటికి డ్రై రేషన్ తీసుకెళ్లి అందజేయగా, తాజాగా ఏడో విడత పంపిణీకి విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 2.4 కేజీలు , హైస్కూల్ విద్యార్థులకు 3.6 కేజీల చొప్పున బియ్యం అందజేయనున్నారు.
అలాగే ప్రతి విద్యార్థికి 13 గుడ్లు, 13 చిక్కీలు అందజేస్తారు. వంట నిర్వహణకు అయ్యే ఖర్చులను లెక్కగట్టి ఆ మేరకు కందిపప్పును జిల్లా కమిటీ ద్వారా కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పంపిణీ పారదర్శ కంగా జరిగేలా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో విద్యాశాఖాధికారులు పర్యవేక్షణ చేయటం తోపాటు భోజనం పథకం యాప్లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
0 Response to "Seventh installment dry ration"
Post a Comment