Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TEACHERS PRC

 పీఆర్సీ దేవుడెరుగు కరువుభత్యమైనా దక్కేనా ?

TEACHERS PRC

  • పెండింగు లో ఐదు డీఏలు వడ్డీ నష్టం .. - ఈ నెలతో కలిపితే ఆరు
  • రూ . 8 వేలకోట్ల బకాయిలు
  • ఏనాడూ రెండు దాటలేదు కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితి " ఉద్యోగుల మౌన రోదన


అమరావతి - ఆంధ్రజ్యోతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దిష్టకాలంలో వేత నసవరణ చేయడం ఆనవాయితీ . అది క్రమం తప్పకుండా ఏ ప్రభుత్వాలున్నా చేస్తాయి . అయితే ఇప్పుడు పీఆర్సీ సంగతి దేవుడెరుగు . కనీసం కరువు భత్యం బకాయిలు కూడా రావడం లేదని ఉద్యోగులు మథనపడుతున్నారు . గత కొన్నేళ్ల కాలంలో ఎప్పుడూ లేనన్ని డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి . రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి . ఈ నెలతో మరో డీఏ కలుస్తుంది . అంటే ఆరు డీఏలు . ప్రభుత్వం మాత్రం జనవరిలో ఒక డీఏ చెల్లిస్తా నంది . అంటే ఇంకా ఐదు డీఏలు పెండింగ్ లో ఉంటాయి . ఈ పెండింగ్ డీఏలకు ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.ఎనిమిది వేల కోట్లు ఉంటుంది . డీఏ చెల్లింపు పరిస్థితే ఇలా ఉంటే ఇక పీఆర్సీ సంగతి ఏంటో అన్న ఆందోళనను పలు వురు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు . సార్లు .... జనవరి , జూలై నెలల్లో డీఏను ప్రకటిస్తారు . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా ఇచ్చే డీఏ సుమా రుగా నెలకు రూ .100 కోట్లు ఉంటుంది . పెరుగు తున్న ధరలకు అనుగుణంగా వీరి జీతాలు ఎప్పటి కప్పుడు పెంచలేరు . కాబట్టి ... ఈ కరువు భత్యం చెల్లిస్తారు . సాధారణంగా ఏ ప్రభుత్వమున్నా డీఏ లను ప్రకటిస్తాయి . రెండు డీఏలకు మించి పెండింగ్ లో పెట్టకుండా చెల్లిస్తుంటాయి . కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది . 2018 జూలై , 2019 జనవరి , 2019 జూలై , 2020 జనవరి , 2020 జూలైల డీఏలు పెండింగ్ లో ఉన్నాయి . ఇందులో 2018 జూలై , 2018 జనవరి డీఏలు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్నాయి . అప్పటి ప్రభుత్వంలో మూడు డీఏలు పెండింగ్ లో ఉంటే ఒకటి చెల్లించి రెండు డీఏలు బకాయిలు పెట్టారు . కానీ ఇప్పుడు ఆ రెండింటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించాల్సిన మూడు బకాయి లు ... అంటే మొత్తం ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి . ఏటా సుమారు రూ .100 కోట్ల చొప్పున ఈ డీఏను లెక్కిస్తే ... 2018 జూలై డీఏకు..నాటి నుంచి నేటివరకు 30 నెలల పాటు రూ .8 వేల కోట్లు చెల్లిం చాలి . 2019 జనవరి డీఏను అప్పటినుంచి గత డిసెంబరు వరకు అంటే 24 నెలలకు రూ .2400 కోట్లు చెల్లించాలి . 2019 జూలై డీఏ కింద రూ .1800 కోట్లు , 2020 జనవరి డీఏ కింద రూ .1200 కోట్లు చెల్లించాలి . ఇవన్నీ కలిపితే సుమారు రూ .8,400 కోట్లు అవుతాయి . పడిపోతున్న రూపాయి విలువ , వెరు గుతున్న ధరలకు అనుగుణంగా డీఏను ఇస్తారు . డీఏ ఇంత అని నిర్ణ యించాక .... ఎప్పుడిచ్చినా దానిపై వడ్డీ ఉండదు . ఎంత నిర్ణయించారో అంతే ఇస్తారు . ఉదాహరణకు 2018 జూలైలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కలిపి నెలకు రూ .100 కోట్లు డీఏ అని నిర్ణయి .... దాన్ని 2021 లో చెల్లించినా అదే రూ .100 కోట్లను చెల్లిస్తారు . అంటే 30 నెలల పాటు దానికి వడ్డీ ఉండదు . 2018 లో రావాల్సిన కరువు భత్యం మూడేళ్ల తర్వాత రావడం వల్ల ఉద్యో గులు .. తమ అవసరాల కోసం ఇతర చోట్ల అప్పులు చేయాల్సి ఉంటుంది . అందరు ఉద్యోగులకు అని కాకున్నా .. మూడు , నాలుగో తరగతి ఉద్యోగులకు ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది . తమ అవసరాల కోసం ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటే దానికి వడ్డీ చెల్లిం చాల్సి వస్తుంది . అదే డీఏ అందితే ఆ బాధ ఉండదు అని ఉద్యోగులు అంటు న్నారు . అదే సమయంలో నిజాయి తీగా ఉండే ఉద్యోగులకు కూడా డీఏ డబ్బులు సకాలంలో రాకపోవడంతో బతుకు బండి నడపడం కష్టతరమే అవుతుందని చెబుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TEACHERS PRC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0